Telugu Global
Cinema & Entertainment

పవన్-క్రిష్ మూవీకి లైన్ క్లియర్

పడుతూలేస్తూ సాగుతున్న పవన్-క్రిష్ మూవీలో మళ్లీ చలనం వచ్చింది. సింగిల్ షెడ్యూల్ పూర్తిచేసి పక్కనపెట్టిన ఈ సినిమాకు పవర్ స్టార్ మళ్లీ కాల్షీట్లు ఇచ్చాడు. డిసెంబర్ లో 10 రోజుల పాటు క్రిష్ మూవీకి సంబంధించి షెడ్యూల్ మొదలుకాబోతోంది. నిజానికి అన్నింటికంటే ముందే పవన్-క్రిష్ సినిమా స్టార్ట్ అవ్వాలి. దిల్ రాజు లాబీయింగ్ తో పవన్ వకీల్ సాబ్ వైపు వెళ్లాల్సి వచ్చింది. అంతలోనే కరోనా/లాక్ డౌన్ వచ్చి పడింది. ఈ గ్యాప్ లో సితార ఎంటర్ […]

పవన్-క్రిష్ మూవీకి లైన్ క్లియర్
X

పడుతూలేస్తూ సాగుతున్న పవన్-క్రిష్ మూవీలో మళ్లీ చలనం వచ్చింది. సింగిల్ షెడ్యూల్ పూర్తిచేసి పక్కనపెట్టిన ఈ సినిమాకు పవర్ స్టార్ మళ్లీ కాల్షీట్లు ఇచ్చాడు. డిసెంబర్ లో 10 రోజుల పాటు క్రిష్ మూవీకి సంబంధించి షెడ్యూల్ మొదలుకాబోతోంది.

నిజానికి అన్నింటికంటే ముందే పవన్-క్రిష్ సినిమా స్టార్ట్ అవ్వాలి. దిల్ రాజు లాబీయింగ్ తో పవన్ వకీల్ సాబ్ వైపు వెళ్లాల్సి వచ్చింది. అంతలోనే కరోనా/లాక్ డౌన్ వచ్చి పడింది. ఈ గ్యాప్ లో సితార ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమా రీమేక్ ను తెరపైకి తీసుకొచ్చారు.

సింగిల్ పేమెంట్ కింద మొత్తం పారితోషికం ఇవ్వడానికి ముందుకొచ్చారు. పైగా కాల్షీట్లు కూడా చాలా తక్కువ. అటుఇటుగా 40 రోజులు చాలు. దీంతో అయ్యప్పనుమ్ కోషియమ్ రీమేక్ ను ముందుకు తెచ్చాడు పవన్. అయితే క్రిష్ మూవీ మరింత ఆలస్యమౌతుండడంతో.. అతి కష్టమ్మీద డిసెంబర్ లో 10 రోజుల కాల్షీట్లు సర్దుబాటు చేశాడు.

విరూపాక్ష వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి అల్యూమినియం ఫ్యాక్టరీలో చిన్నపాటి సెట్ వేశారు. అందులోనే నెక్ట్స్ షెడ్యూల్ ను కూడా కంటిన్యూ చేయబోతున్నారు.

First Published:  12 Nov 2020 6:42 AM GMT
Next Story