బీహార్లో ఓటమి... తమిళనాడు కాంగ్రెస్ కొంపముంచిందా?
ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. మహాఘట్ బంధన్ పేరుతో అక్కడి ఆర్జేడీతో పొత్తుపెట్టుకుంది. అయితే కూటమిలోని తన మిత్రపక్షమైన ఆర్జేడీకి గణనీయమైన స్థానాలు రాగా కాంగ్రెస్ పోటీచేసిన స్థానాల్లో ఓటమి చవిచూసింది. అయితే కాంగ్రెస్తో పోత్తు పెట్టుకోకపోయిఉంటే తాము అధికారంలోకి వచ్చి ఉండేవారమని ఆర్జేడీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం బీజేపీకి లాభించిందని.. కాంగ్రెస్ పోటీచేసిన చాలా స్థానాల్లో బీజేపీ గెలుపొందిందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. బీహార్లో […]
ఇటీవల జరిగిన బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఫలితాలను చవిచూసింది. మహాఘట్ బంధన్ పేరుతో అక్కడి ఆర్జేడీతో పొత్తుపెట్టుకుంది. అయితే కూటమిలోని తన మిత్రపక్షమైన ఆర్జేడీకి గణనీయమైన స్థానాలు రాగా కాంగ్రెస్ పోటీచేసిన స్థానాల్లో ఓటమి చవిచూసింది. అయితే కాంగ్రెస్తో పోత్తు పెట్టుకోకపోయిఉంటే తాము అధికారంలోకి వచ్చి ఉండేవారమని ఆర్జేడీ నేతలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్ తో పొత్తుపెట్టుకోవడం బీజేపీకి లాభించిందని.. కాంగ్రెస్ పోటీచేసిన చాలా స్థానాల్లో బీజేపీ గెలుపొందిందని ఆర్జేడీ నేతలు భావిస్తున్నారు. బీహార్లో ఆర్జేడీతో పొత్తుపెట్టుకున్న కాంగ్రెస్ 70 అసెంబ్లీ నియోజకవర్గాలలో పోటీచేసి కేవలం 19 నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. దీంతో మహాఘట్బంధన్ ఓడిపోయింది. కాంగ్రెస్ ఓటమితో ఆర్జేడీ నష్టపోయింది.
ఈ క్రమంలో బీహార్ ఎన్నికల ఫలితం తమిళనాడులో కాంగ్రెస్ కొంప ముంచేటట్టు ఉన్నదని విశ్లేషకులు భావిస్తున్నారు. మరో ఆరు నెలల్లో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగునున్నాయి. అయితే అక్కడ అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మృతితో ఆ పార్టీ చతికిల బడింది. దానికి తోడు సీఎం పళని స్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్సెల్వం ప్రజా బలం ఉన్న నాయకులు కారు. ఈ సారి ఎన్నికల్లో అక్కడ డీఎంకే ఘనవిజయం సాధించడం ఖాయమని రాజకీయవిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అయితే అక్కడ కూడా డీఎంకే తన మిత్రమపక్షమైన కాంగ్రెస్తో పోటీచేయనున్నది.
బీహార్ ఫలితంపై డీఎంకే ఆందోళన
ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్కు ఎక్కువ సీట్లు ఇస్తే బీహార్ సీన్ రిపీట్ అయి తాము ఓడిపోతామేమోనని డీఎంకే నేతలు ఆందోళన చెందుతున్నారు. దీంతో కాంగ్రెస్కు వీలైనన్నీ తక్కువ సీట్లు కేటాయించాలని ఆ పార్టీ నేతలు యోచిస్తున్నారు. బీహార్ పరిస్థితి తమిళనాట ఏర్పడకూడదనే డీఎంకే అధిష్ఠానవర్గం భావిస్తున్నది. ఈ సారి కాంగ్రెస్కు గతం కంటే తక్కువ సీట్లను మాత్రమే కేటాయించాలని చూస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో డీఎంకే అధిష్ఠానవర్గం కాంగ్రెస్కు 40 సీట్లు కేటాయించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎనిమిది నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది.
ఈ కారణంగా డీఎంకే 90 స్థానాల్లో గెలిచినా కాంగ్రెస్ ఘోరపరాజయం కారణంగా మెజారిటీ లేక అధికారంలోకి రాలేకపోయింది. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకొనే డీఎంకే కాంగ్రెస్కు సీట్లు కేటాయించే విషయమై కొద్ది నెలలుగా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నది. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు 20 సీట్లు మాత్రమే కేటాయించాలని డీఎంకే సీనియర్ నేలు ఆ పార్టీ అధినేత ఎంకే స్టాలిన్ను కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ ఓటుబ్యాంక్ నుంచి డీఎంకే అభ్యర్థులకు ఓట్లు పడటం లేదని ఆ పార్టీనేతలు చెబుతున్నారు. ఈ అంశాలను నిశితంగా పరిశీలించి కాంగ్రెస్కు సీట్లను కేటాయించే విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా స్టాలిన్కు వారు సూచిస్తున్నారు
కాంగ్రెస్ ఏమంటోంది?
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో డీఎంకే కూటమి ఘనవిజయం సాధించడానికి కాంగ్రెస్ దోహదం చేసిందని తమిళనాడు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. లోక్సభ ఎన్నికల్లో తేని నియోజకవర్గం సహా అన్ని స్థానాల్లోనూ డీఎంకే కూటమి అభ్యర్థులు గెలిచారని.. ఆ ఎన్నికల్లోనే కాంగ్రెస్ పార్టీ ఇమేజ్ బాగా పనిచేసిందని పార్టీ నేతలు వాదిస్తున్నారు.
బీహార్ ఎన్నికల ఫలితాను పరిగణనలోకి తీసుకొని డీఎంకే కూటమిలో తమ పార్టీకి తక్కువ సీట్లు కేటాయించాలనుకోవడం తగదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకే ప్రభుత్వ పాలనపై రాష్ట్ర ప్రజల్లో వ్యతిరేకత ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే గెలిచి అధికారంలోని రావడం ఖాయమని ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్కు మునపటి కంటే ఎక్కువ సీట్లు ఇస్తే తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్ నాయకులు డీఎంకే అధిష్ఠానవర్గానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందుతుండటంతో రాష్ట్రంలో ఆ పార్టీకి ఎక్కవ సీట్లు ఇస్తే తమ గెలుపునకు తామే అడ్డుకట్ట వేసుకున్నట్టవుతుందని డీఎంకే సీనియర్ నేతలు స్టాలిన్ ను హెచ్చరిస్తున్నారు. ఈ సారి తమిళనాడులో డీఎంకే నేతలు కాంగ్రెస్కు కేవలం 20 లోపే సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.