వరదసాయం రూ. 50 వేలు... మ్యానిఫెస్టో విడుదల చేసిన కాంగ్రెస్
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేసేందుకు అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం మొదలుపెట్టి టీఆర్ఎస్ దూసుకుపోతుండగా.. బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారం ముమ్మరం చేశాయి. సీఎం కేసీఆర్ సోమవారం మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని వర్గాలవారికి వరాలు కురిపించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వరాల జల్లు కురిపించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 […]
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పాగా వేసేందుకు అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ దూసుకుపోతున్నాయి. అందరికంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించి.. ప్రచారం మొదలుపెట్టి టీఆర్ఎస్ దూసుకుపోతుండగా.. బీజేపీ, కాంగ్రెస్ కూడా ప్రచారం ముమ్మరం చేశాయి.
సీఎం కేసీఆర్ సోమవారం మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన అన్ని వర్గాలవారికి వరాలు కురిపించారు. మంగళవారం కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో విడుదల చేసింది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి వరాల జల్లు కురిపించారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 25 లక్షలు పరిహారం అందిస్తామని ప్రకటించారు. ఇళ్లు దెబ్బతిన్న వారికి రూ. 2.5 లక్షల నుంచి 5 లక్షల వరకు సాయమందిస్తామని ప్రకటించారు.
మరోవైపు వరదల్లో మునిగిన కుటుంబాలకు తక్షణసాయం కింద రూ. 50 వేలు చెల్లిస్తామని మ్యానిఫెస్టోలో పొందుపరిచారు. ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళలకు, దివ్యాంగులకు ఉచిత సౌకర్యం కల్పిస్తామన్నారు. ఎయిర్పోర్ట్ వరకు మెట్రో విస్తరిస్తామని కూడా మ్యానిఫెస్టోలో ప్రకటించారు.
ఇటీవల హైదరాబాద్లో వచ్చిన వరదలు నగర ప్రజలను తీవ్రంగా ఇబ్బందికి గురిచేశాయి. అయితే వరదల్లో నష్టపోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేలు ఆర్థికసాయం ప్రకటించింది. కానీ ఆ సొమ్ము అందజేతలో భారీగా అవినీతి జరిగిందన్న ఆరోపణలు వినిపించాయి. టీఆర్ఎస్ కార్యకర్తలకే డబ్బులు ఇచ్చారని.. చోటా మోటా నాయకులు సగం డబ్బులే ఇచ్చారని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో ఈ విషయాన్ని ప్రతిపక్షాలు బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్లో పర్యటిస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేలను ఇదే విషయంపై ప్రజలు నిలదీస్తున్నారు.
తాజాగా ఖైరతాబాద్లో ప్రచారం నిర్వహించిన అక్కడి ఎమ్మెల్యే దానం నాగేందర్కు ప్రజల నుంచి ప్రతిఘటన ఎదురుకావడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా మ్యానిఫెస్టోను రూపొందించింది. వరద బాధిత కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం ప్రకటించడం నిజంగా సాహసమే. మరోవైపు చనిపోయిన కుటుంబాలకు, ఇళ్లు కోల్పోయిన కుటుంబాలకు కూడా భారీ సాయాన్ని అందజేస్తామని ప్రకటించారు.