షూటింగ్ మధ్యలో వెళ్లిపోయిన శృతి
హీరోహీరోయిన్లు ఎవరైనా షూటింగ్ మధ్యలో వెళ్లిపోతే అది పెద్ద సంచలనం. పైగా వివాదాస్పదం కూడా. హీరోయిన్ శృతిహాసన్ కూడా అదే చేసింది. సెట్ లో అంతా రెడీ చేసిన తర్వాత షూటింగ్ మధ్య నుంచి ఆమె లేచి వెళ్లిపోయింది. అయితే ఈసారి మాత్రం ఇది వివాదాస్పదం కాలేదు. పైగా అందరి ప్రశంసలు అందుకుంటోంది కూడా. మేటర్ ఏంటో చూద్దాం.. కోలీవుడ్ లో విజయ్ సేతుపతి హీరోగా లాబం అనే సినిమాలో నటిస్తోంది శృతిహాసన్. లాక్ డౌన్ తర్వాత […]
హీరోహీరోయిన్లు ఎవరైనా షూటింగ్ మధ్యలో వెళ్లిపోతే అది పెద్ద సంచలనం. పైగా వివాదాస్పదం కూడా. హీరోయిన్ శృతిహాసన్ కూడా అదే చేసింది. సెట్ లో అంతా రెడీ చేసిన తర్వాత షూటింగ్ మధ్య నుంచి ఆమె లేచి వెళ్లిపోయింది. అయితే ఈసారి మాత్రం ఇది వివాదాస్పదం కాలేదు. పైగా అందరి ప్రశంసలు అందుకుంటోంది కూడా. మేటర్ ఏంటో చూద్దాం..
కోలీవుడ్ లో విజయ్ సేతుపతి హీరోగా లాబం అనే సినిమాలో నటిస్తోంది శృతిహాసన్. లాక్ డౌన్ తర్వాత లేటెస్ట్ గా ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది. దీని కోసం ఉత్తర తమిళనాడులోకి ఓ మారుమూల ప్రాంతంలో షూటింగ్ ఏర్పాటుచేశారు. శృతిహాసన్ వచ్చిందని తెలియడంతో చుట్టుపక్కల ప్రజలు వేల సంఖ్యలో షూటింగ్ స్పాట్ కు చేరుకున్నారు.
అయితే ఇది కరోనా టైమ్. ఎక్కువమంది గుమిగూడకూడదు. భౌతికదూరం పాటించాలి. మాస్కులు ధరించాలి. ఇవేవీ శృతిహాసన్ కు అక్కడ కనిపించలేదు. తన వల్ల వేలమంది జనాలు వైరస్ బారిన పడడం ఆమెకు ఇష్టంలేదు. తనే అక్కడ లేకుండా ఉంటే ఏ సమస్య ఉండదని భావించింది.
అందుకే లొకేషన్ నుంచి వెళ్లిపోయింది. శృతిహాసన్ చేసిన పనికి అంతా మెచ్చుకుంటున్నారు. అటు నిర్మాతలు కూడా ఇకపై సెట్స్ లోనే షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.