పార్టీ మారకముందే... స్టాండ్ మార్చిన రాములమ్మ...!
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను రాములమ్మ గానీ ఇటు బీజేపీ వర్గాలు కానీ ఖండించలేదు.. ధ్రువీకరించలేదు. ఈ నేపథ్యంలో విజయశాంతి పెట్టిన ట్వీట్లు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఆమె మద్దతుగా ట్వీట్లు పెట్టారు. హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాళ్లు ఉన్నారని వాళ్లను తరిమికొట్టేందుకు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామంటూ బండి సంజయ్ అన్నారు. ఈ […]
కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఆమె త్వరలోనే బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను రాములమ్మ గానీ ఇటు బీజేపీ వర్గాలు కానీ ఖండించలేదు.. ధ్రువీకరించలేదు.
ఈ నేపథ్యంలో విజయశాంతి పెట్టిన ట్వీట్లు రాజకీయంగా దుమారం రేపాయి. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్కి ఆమె మద్దతుగా ట్వీట్లు పెట్టారు. హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు, పాకిస్థాన్ వాళ్లు ఉన్నారని వాళ్లను తరిమికొట్టేందుకు సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామంటూ బండి సంజయ్ అన్నారు. ఈ మాటలు రాజకీయంగా పెను దుమారం రేపాయి.
టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ.. సంజయ్ వ్యాఖ్యలను ఖండించారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్లో బీజేపీ నేతలు చిచ్చు పెడుతున్నారని వాళ్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేత విజయశాంతి సంజయ్కు మద్దతుగా ట్వీట్లు పెట్టడం చర్చనీయాంశం అయ్యింది.
‘గతంలో ఓవైసీ ఎన్నోసార్లు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. 10 నిమిషాలు టైం ఇస్తే మా సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. హిందూ దేవుళ్లను కించపరిచేలా వ్యాఖ్యానించారు. మేం ఉమ్మేస్తే చార్మినార్ను ఆనుకొని ఉన్న భాగ్యలక్ష్మి టెంపుల్ మునిగిపోతుందని అన్నారు. నేరుగా ఓ డీజీపీని పట్టుకొని యూనిఫామ్ వదిలి రా చూసుకుందాం.. అని సవాల్ విసిరారు.. అప్పుడు టీఆర్ఎస్ నేతలు కనీసం ఒవైసీ మాటలను ఖండించలేదు. పైగా ఎంఐఎం, టీఆర్ఎస్ మిత్రపక్షాలుగా చలామణి అయ్యాయి.
ఇటీవల కూడా ఓవైసీ ప్రగతిభవన్కు వెళ్లి సీఎం కేసీఆర్తో సమావేశమయ్యారు. ఇప్పుడు ఎన్నికలొచ్చాయని మళ్లీ ఇద్దరూ డ్రామాలు మొదలుపెట్టారు. బండి సంజయ్ వ్యాఖ్యల్లో తప్పేముంది. నిజంగా కేసీఆర్కు ధైర్యం ఉంటే పాతబస్తీ మొత్తం సర్వే చేయించాలి. ఇక్కడ ఉన్న రోహింగ్యాలను, పాకిస్థాన్ వాళ్లను గుర్తించాలి. అంతేకాని బండి సంజయ్ మీద ఎదురు దాడి చేయడం ఏమిటి’ అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు పెట్టారు.
అయితే పార్టీ మారకముందే రాములమ్మ తన స్టాండ్ను మార్చుకున్నారని సోషల్మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
మరోవైపు రేపో మాపో విజయశాంతి బీజేపీలో అధికారికంగా చేరతారని ప్రచారం జరుగుతున్నది. జీహెచ్ఎంసీ ప్రచారంలో భాగంగా అమిత్ షా హైదరాబాద్కు రానున్నారు. అప్పుడు విజయశాంతి బీజేపీలో చేరే అవకాశం ఉన్నదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.