Telugu Global
Cinema & Entertainment

ప్రభాస్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ

మరో పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పాడు ప్రభాస్. అది కూడా అలాంటిలాంటి దర్శకుడితో కాదు. దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్ సినిమాను తీసిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని కేజీఎఫ్ నిర్మాతలు పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమాను తెరకెక్కిస్తున్న హోబలే ఫిలిమ్స్ సంస్థ, తమ నెక్ట్స్ ప్రాజెక్టు కూడా పాన్ ఇండియన్ సినిమానే అని ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా ఎనౌన్స్ చేసింది. […]

ప్రభాస్ నుంచి మరో పాన్ ఇండియా మూవీ
X

మరో పాన్ ఇండియా సినిమాకు ఓకే చెప్పాడు ప్రభాస్. అది కూడా అలాంటిలాంటి దర్శకుడితో కాదు. దేశవ్యాప్తంగా సూపర్ హిట్టయిన కేజీఎఫ్ సినిమాను తీసిన ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ మూవీ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని కేజీఎఫ్ నిర్మాతలు పరోక్షంగా వెల్లడించారు.

ప్రస్తుతం కేజీఎఫ్-2 సినిమాను తెరకెక్కిస్తున్న హోబలే ఫిలిమ్స్ సంస్థ, తమ నెక్ట్స్ ప్రాజెక్టు కూడా పాన్ ఇండియన్ సినిమానే అని ప్రకటించింది. త్వరలోనే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని కూడా ఎనౌన్స్ చేసింది. అయితే అది ప్రభాస్-ప్రశాంత్ నీల్ సినిమానే అనేది ఓపెన్ సీక్రెట్.

కొన్నాళ్లుగా ప్రభాస్ తో చర్చలు జరుపుతున్నాడు ప్రశాంత్ నీల్. ఒక దశలో ప్రభాస్ నో చెప్పాడని, ఆ టైమ్ లో మహేష్ వైపు వెళ్లాడని కూడా వార్తలొచ్చాయి. కానీ ప్రభాస్-ప్రశాంత్ మూవీ లాక్ అయింది. త్వరలోనే ఈ సినిమా ప్రకటన వస్తుంది.

ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. దీని తర్వాత ఆదిపురుష్, నాగ్ అశ్విన్ సినిమాలున్నాయి. ఇవి కంప్లీట్ అయిన తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా వస్తుంది. ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ తో సినిమా చేస్తాడు ప్రశాంత్ నీల్.

First Published:  30 Nov 2020 8:48 PM GMT
Next Story