Telugu Global
National

నారాయణ మళ్లీ చెవి కోసుకుంటాడట..!

సంచలన కామెంట్లు చేయడంలో ఆయన దిట్ట. మీడియా అటెన్షన్​ను డైవర్ట్​ చేయాలన్నా.. మీడియాకు ఎప్పటికప్పుడు స్టఫ్​ ఇవ్వాలన్నా ఆయనకే సాధ్యం. గాంధీ జయంతి రోజు చికెన్​ తిని తెలుగురాష్ట్రాల్లోనే ఎంతో పాపులర్​ అయ్యారు. ఆయనే సీసీఐ నారాయణ. సీపీఐ అగ్రనేతగా ఉండి తాను క్యాపిటల్​ పుస్తకమే చదవలేదని సంచలనం సృష్టించారు. కమ్యూనిస్టులకు బద్ద శత్రువైన బీజేపీ కి చెందిన కార్యకర్తలను మెచ్చుకోవడం… ఆ తర్వాత తన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకోవడం కూడా ఆయనకే చెల్లింది. ఏది ఏమైనా […]

నారాయణ మళ్లీ చెవి కోసుకుంటాడట..!
X

సంచలన కామెంట్లు చేయడంలో ఆయన దిట్ట. మీడియా అటెన్షన్​ను డైవర్ట్​ చేయాలన్నా.. మీడియాకు ఎప్పటికప్పుడు స్టఫ్​ ఇవ్వాలన్నా ఆయనకే సాధ్యం. గాంధీ జయంతి రోజు చికెన్​ తిని తెలుగురాష్ట్రాల్లోనే ఎంతో పాపులర్​ అయ్యారు. ఆయనే సీసీఐ నారాయణ. సీపీఐ అగ్రనేతగా ఉండి తాను క్యాపిటల్​ పుస్తకమే చదవలేదని సంచలనం సృష్టించారు.

కమ్యూనిస్టులకు బద్ద శత్రువైన బీజేపీ కి చెందిన కార్యకర్తలను మెచ్చుకోవడం… ఆ తర్వాత తన వ్యాఖ్యలను గట్టిగా సమర్థించుకోవడం కూడా ఆయనకే చెల్లింది. ఏది ఏమైనా తెలుగు రాష్ట్రాల్లో ఆయనో సంచలన లీడర్​. ఆయన ఎక్కడికెళ్లినా మీడియా ఫాలో అయిపోతూ ఉంటుంది.

గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ గెలిస్తే చెవి కోసుకుంటానంటూ ఆయన సవాల్​ విసిరారు. ఆ తర్వాత టీఆర్​ఎస్​ భారీ మెజార్టీతో గెలవడం… ఈ విషయాన్ని టీఆర్​ఎస్​ అధినేత ఫన్నీగా గుర్తుచేసుకోవడం కూడా జరిగింది. ‘చెవిలేని నారాయణను నేను చూడలేను’ అంటూ సీఎం కేసీఆర్​ అప్పట్లో అన్నారు.

అయితే ఈ వ్యాఖ్యను కూడా నారాయణ సీరియస్​గా తీసుకోలేదు. తాజాగా అమరావతి విషయంలోనూ నారాయణ ఇటువంటి వ్యాఖ్యలే చేశారు. అమరావతి కోసం తెలుగుదేశం పార్టీ, ఆ ప్రాంత సమీపంలోని కొన్ని గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యమం ప్రారంభమై సంవత్సరం పూర్తయిదంటూ ఇటీవలే టీడీపీ హడావుడి చేసింది.

మరోవైపు వైసీపీ కూడా కౌంటర్​ దీక్షలు చేసింది. అమరావతి లో జరిగేది పెయిడ్​ ఉద్యమమని… టీడీపీ అనుయాయులు… అమరావతిలో భూములు కొన్న బినామీలే ఈ ఉద్యమాన్ని నడుపుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తున్నది.

ఈ నేపథ్యంలో నారాయణ ఓ కామెంట్​ చేశారు.

‘అమరావతిలో జరిగేది పెయిడ్​ ఉద్యమం… అని సీఎం జగన్​ అంటున్నారు. కానీ అది నిజం కాదు. మూడు రాజధానులకు మద్దతుగా జరుగుతున్నది పెయిడ్​ ఉద్యమం. నేను సవాల్​ చేస్తున్నా.. ఈ ఉద్యమం మరో ఆరు నెలలకు మించి సాగదు. ఒకవేళ ఆరునెలలపాటు మూడు రాజధానులకు అనుకూలంగా ఉద్యమం సాగితే నేను చెవి కోసుకుంటా’ అంటూ నారాయణ వ్యాఖ్యానించారు. నారాయణ ఆరోపణలపై ఇప్పటికైతే వైసీపీ స్పందించలేదు.

First Published:  19 Dec 2020 9:56 AM GMT
Next Story