Telugu Global
NEWS

పచ్చ కామెర్లు సోకిన బోడిలింగానివి నువ్వే... పవన్ పై... నానీ రివర్స్​ అటాక్​!

నివర్ తుఫాన్ బాధితులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అధికార పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోమవారం ఆయన గుడివాడలో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీలో చాలా మంది నానిలు ఉన్నారు. ఇక్కడున్న నాని ఎవరో తెలియదు. ఏ బోడిలింగం అయితే ఏమిటి’ అంటూ మంత్రి కొడాలి నానిపై ఫైర్​ అయ్యారు. అధికార దాహంతో ఇష్టమొచ్చినట్టు వాగితే ఊరుకోబోనని హెచ్చరించారు. […]

పచ్చ కామెర్లు సోకిన బోడిలింగానివి నువ్వే... పవన్ పై... నానీ రివర్స్​ అటాక్​!
X

నివర్ తుఫాన్ బాధితులకు మద్దతుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లాలో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా అధికార పార్టీ నాయకులను టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. సోమవారం ఆయన గుడివాడలో రోడ్ షో నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘వైసీపీలో చాలా మంది నానిలు ఉన్నారు. ఇక్కడున్న నాని ఎవరో తెలియదు. ఏ బోడిలింగం అయితే ఏమిటి’ అంటూ మంత్రి కొడాలి నానిపై ఫైర్​ అయ్యారు. అధికార దాహంతో ఇష్టమొచ్చినట్టు వాగితే ఊరుకోబోనని హెచ్చరించారు.

దీంతో పవన్​ కల్యాణ్​పై వ్యాఖ్యలపై నానీ రివర్స్​ అటాక్​ చేశారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామంలో మంగళవారం ‘పేదలకు ఇల్లు పంపిణీ’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘పవన్​ కల్యాణే పెద్ద బోడి లింగం. మేమంతా శివలింగాలం కాబట్టే మచిలీపట్నం, గుడివాడ ప్రజలు మమ్మల్ని గెలిపించారు. పవన్​ కల్యాణ్​ బోడిలింగం కాబట్టే ప్రజలు ఓడించారు.

అందుకే గాజువాక, భీమవరం ప్రజలు పవన్​కల్యాణ్​ను కిందపడేసి తొక్కారు. ప్యాకేజీలు తీసుకొని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ లు చదువుతూ పచ్చ కామెర్లు సోకిన వాళ్ల మాటలను ప్రజలను నమ్మరు. చంద్రబాబు లాంటి గజదొంగ పంచనచేరిన పవన్​కల్యాణ్​ సీఎం జగన్​ బొచ్చుకూడా పీకలేరు’ అంటూ కొడాలి నాని ఘాటు కౌంటర్లు ఇచ్చారు.

నిన్న పవన్​కల్యాణ్​ గుడివాడలో ప్రసంగించడం సంచలనంగా మారింది. దీంతో ఆయనపై వరుసగా వైసీపీ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటికే విజయసాయిరెడ్డి ట్వీట్​చేయగా.. కొడాలి నాని కూడా పంచులు వేశారు.

First Published:  29 Dec 2020 3:16 AM GMT
Next Story