ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ పోవాలి..! అఖిలేష్ వ్యాఖ్యలు
ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే భారతీయజనతాపార్టీ ఉండొద్దని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు డెత్ వారెంట్ల వంటివని పేర్కొన్నారు. లక్నో పార్టీ ఆఫీస్లో అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరైనా తీసుకొంటే వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించడం దేశద్రోహం ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలా అయితే ఈ దేశంలో […]
ఈ దేశంలో ప్రజాస్వామ్యం బతకాలంటే భారతీయజనతాపార్టీ ఉండొద్దని యూపీ మాజీ సీఎం, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టాలు రైతులకు డెత్ వారెంట్ల వంటివని పేర్కొన్నారు. లక్నో పార్టీ ఆఫీస్లో అఖిలేశ్ మీడియాతో మాట్లాడారు.
‘కేంద్ర ప్రభుత్వం, లేదా బీజేపీ పాలిత రాష్ట్రాలు తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరైనా తీసుకొంటే వాళ్లను దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు. రైతు చట్టాలను వ్యతిరేకించడం దేశద్రోహం ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. ఇలా అయితే ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది బతకదు. యూపీలో బీజేపీ చేస్తున్న అక్రమాలకు, అన్యాయాలకు అంతులేకుండా పోతోంది. దాన్ని ఎదుర్కొనేందుకు ఎస్పీ కార్యకర్తలు సమాయత్తం కావాలి. బీజేపీ అక్రమాలను దీటుగా తిప్పికొట్టాలి.
హత్రాస్ ఘటనపై బీజేపీ ఎన్ని పచ్చి అబద్ధాలు చెప్పిందో చూశాం. ఇక్కడ ప్రజాస్వామ్యం బతకాలంటే బీజేపీ పోవాల్సిందే. రైతులకు ఎంతో మేలు చేస్తున్న మండీలు తీసేస్తామంటున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాలను వ్యతిరేకిస్తే దేశద్రోహులుగా చిత్రీకరిస్తున్నారు.
బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు కొమ్ము కాస్తోంది. రైతు చట్టాలు రైతుల పాలిట మరణశాసనాలు.. వాటిని తీసేసేవరకు పోరాటాలు సాగాలి’ అంటూ ఆయన పిలుపునిచ్చారు.
యూపీలో త్వరలో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సమాజ్వాద్ పార్టీ దూకుడు పెంచింది. యోగి ఆదిత్యనాథ్ సీఎం అయ్యాక .. రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదని సమాజ్వాద్ పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.