Telugu Global
National

ప్రగతిభవన్​ ముట్టడికి యత్నం.. బీజేపీ కార్పొరేటర్ల అరెస్ట్..!

ఇటీవల జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ప్రగతిభవన్​ను ముట్టడించేందుకు యత్నించారు. తాము గెలిచి నెలరోజులవుతున్నా.. ఇంతవరకు ప్రమాణం చేయించకుండా కాలయాపన చేస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జీహెచ్​ఎంసీ పాలకమండలిని నియమించాలని డిమాండ్​ చేశారు. అంతకు ముందు బేగంపేటలోని హరితప్లాజాలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రరెడ్డితో కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్‌ ఆకుల రమేష్‌ గౌడ్‌ మృతికి సంతాపం తెలిపారు. అనంతరం బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు […]

ప్రగతిభవన్​ ముట్టడికి యత్నం.. బీజేపీ కార్పొరేటర్ల అరెస్ట్..!
X

ఇటీవల జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన బీజేపీ కార్పొరేటర్లు మంగళవారం ప్రగతిభవన్​ను ముట్టడించేందుకు యత్నించారు. తాము గెలిచి నెలరోజులవుతున్నా.. ఇంతవరకు ప్రమాణం చేయించకుండా కాలయాపన చేస్తున్నారని వాళ్లు ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే జీహెచ్​ఎంసీ పాలకమండలిని నియమించాలని డిమాండ్​ చేశారు. అంతకు ముందు బేగంపేటలోని హరితప్లాజాలో మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత చింతల రామచంద్రరెడ్డితో కార్పొరేటర్లు సమావేశమయ్యారు. ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన లింగోజిగూడ కార్పొరేటర్‌ ఆకుల రమేష్‌ గౌడ్‌ మృతికి సంతాపం తెలిపారు.

అనంతరం బీజేపీ కార్పొరేటర్లు, కార్యకర్తలు ప్రగతిభవన్​ను ముట్టడించేందుకు వెళ్లారు. దీంతో వెంటనే అలర్టయిన పోలీసులు కార్పొరేటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా వాళ్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. తాము ఏమన్నా రౌడీ షీటర్లమా.. అంటూ ప్రశ్నించారు. కేసీఆర్​ డౌన్​ డౌన్​, కేటీఆర్​ డౌన్​ డౌన్​ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్పొరేటర్లు మాట్లాడుతూ.. తాము గెలిచి నెలరోజులవుతున్నా తమకు గుర్తింపు దక్కడం లేదని వాపోయారు. జీహెచ్​ఎంసీ మేయర్​ ఎన్నిక జరగకుండా రాష్ట్రప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని వాళ్లు ఆరోపించారు.

మరోవైపు టీఆర్​ఎస్​ నేతలు కొందరు ప్రలోభాలకు తెరలేపారని పేర్కొన్నారు. ఒక్క బీజేపీ కార్పొరేటర్​ కూడా అమ్ముడుపోరని వాళ్లు చెప్పారు. వెంటనే జీహెచ్​ఎంసీ పాలకమండలిని ఏర్పాటుచేయాలని.. మేయర్​ ఎన్నిక నిర్వహించాలని కొంతకాలంగా బీజేపీ నేతలు డిమాండ్​ చేస్తున్నారు.

కాగా ఈ ఎన్నికల్లో అధికార టీఆర్​ఎస్​ పార్టీకి మ్యాజిక్​ ఫిగర్​ దక్కలేదన్న విషయం తెలిసిందే. ఆ పార్టీ మేయర్​ పదవిని చేపట్టాలంటే ఎంఐఎం మద్దతు తీసుకోవాల్సిందే. అయితే గత ఎన్నికల ముందు టీఆర్​ఎస్​, ఎంఎంఐం ఒక్కటేనని టీఆర్​ఎస్​కు ఓటేసినా.. ఎంఐఎంకు ఓటు వేసినట్టేనని బీజేపీ నేతలు ఆరోపించారు. కానీ టీఆర్​ఎస్​ నేతలు బీజేపీ ఆరోపణలను ఖండించారు. ఈ క్రమంలో ప్రస్తుతం మేయర్​ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది.

First Published:  5 Jan 2021 4:43 AM GMT
Next Story