Telugu Global
NEWS

ఇది ఫిక్స్​.. సాగర్​ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్​..!

కాంగ్రెస్​ పార్టీ ప్రతి విషయంలోనూ లేటే.. అభ్యర్థుల ఎంపిక.. పొత్తులు ఎత్తులు.. ఇలా ప్రతివిషయంలోనూ ఆలస్యంగానే స్పందిస్తుంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడి ప్రకటన విషయంలోనూ ఎన్నిరోజులుగా నాన్చుడు ధోరణి అవలంభిస్తుందో చూస్తునే ఉన్నాం. కాంగ్రెస్​ అభ్యర్థిని ప్రకటించేలోపే ప్రత్యర్థి పార్టీలు దూసుకుపోతుంటాయి. అంతర్గత కుమ్ములాటలు ముగించుకుని కాంగ్రెస్​ ప్రచారపర్వంలోకి వచ్చేసరికి ప్రత్యర్థి పార్టీలు ఓ రౌండ్​ ప్రచారం ముగించేస్తాయి. ఇదీ ఇన్నాళ్లుగా కాంగ్రెస్​ వరస. కానీ తాజాగా సాగర్​ ఉప ఎన్నికల సందర్భంగా మాత్రం కాంగ్రెస్​ పార్టీ […]

ఇది ఫిక్స్​.. సాగర్​ అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించిన కాంగ్రెస్​..!
X

కాంగ్రెస్​ పార్టీ ప్రతి విషయంలోనూ లేటే.. అభ్యర్థుల ఎంపిక.. పొత్తులు ఎత్తులు.. ఇలా ప్రతివిషయంలోనూ ఆలస్యంగానే స్పందిస్తుంది. ఇటీవల పీసీసీ అధ్యక్షుడి ప్రకటన విషయంలోనూ ఎన్నిరోజులుగా నాన్చుడు ధోరణి అవలంభిస్తుందో చూస్తునే ఉన్నాం. కాంగ్రెస్​ అభ్యర్థిని ప్రకటించేలోపే ప్రత్యర్థి పార్టీలు దూసుకుపోతుంటాయి. అంతర్గత కుమ్ములాటలు ముగించుకుని కాంగ్రెస్​ ప్రచారపర్వంలోకి వచ్చేసరికి ప్రత్యర్థి పార్టీలు ఓ రౌండ్​ ప్రచారం ముగించేస్తాయి. ఇదీ ఇన్నాళ్లుగా కాంగ్రెస్​ వరస.

కానీ తాజాగా సాగర్​ ఉప ఎన్నికల సందర్భంగా మాత్రం కాంగ్రెస్​ పార్టీ అలర్టయ్యింది. ఈ సారి అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించేసింది. అక్కడ కాంగ్రెస్​ సీనియర్​ నేత జానారెడ్డి కానీ ఆయన కుమారుడు రఘువీర్​రెడ్డి కానీ పోటీచేస్తారని తొలి నుంచి అంతా భావించారు. కానీ రఘువీర్​ రెడ్డి బీజేపీలో చేరతారని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలో కొంత ప్రతిష్ఠంభన నెలకొంది. అయితే నేరుగా జానారెడ్డి రంగంలోకి దిగి ఈ ప్రచారానికి తెరదించారు. తాను కాంగ్రెస్​ పార్టీలోనే ఉంటానని తేల్చిచెప్పారు. తన కుమారుడు కూడా బీజేపీలో చేరడం లేదని స్పష్టం చేశారు.

కాగా నిన్న ఇందిరాపార్క్​ వద్ద కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ధర్నాలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్​రెడ్డి సాగర్​ కాంగ్రెస్​ అభ్యర్థి జానారెడ్డి అని ప్రకటించేశారు. దీంతో ఈ సారి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కాస్త ముందుగానే రంగంలోకి దిగినట్టు అయ్యింది. అక్కడ ఇంకా బీజేపీ, టీఆర్​ఎస్​ అభ్యర్థులను ప్రకటించలేదు.

జానారెడ్డి ఇప్పటికే ప్రచారం కూడా మొదలుపెట్టారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత తమకు ఎంతో పట్టున్న సాగర్​లో ఎలాగైనా గెలవాలని కాంగ్రెస్​ పట్టుదలతో ఉంది.

First Published:  10 Jan 2021 9:01 AM GMT
Next Story