Telugu Global
National

కరోనా కాలంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపాదన : ఆక్స్‌ఫామ్ నివేదిక

కరోనా కాలంలో చేసేందుకు కూలి లేక, పరిశ్రమలు మూతపడి, ఉద్యోగాలు కోల్పోయి ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయారు. కల్లోగంజో తాగి బతుకుదామంటూ లక్షలాది మంది సొంతూర్లకు తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు అపర కుబేరుల సంపద మాత్రం కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా భారీగా పెరిగింది. ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ సంపద గంటలకు రూ. 90 కోట్ల చొప్పున పెరిగిందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొన్నది. ఏ నైపుణ్యం లేని కార్మికుడు కనీసం మూడేళ్ల పాటు ఎంత […]

కరోనా కాలంలోనూ భారీగా పెరిగిన అంబానీ సంపాదన : ఆక్స్‌ఫామ్ నివేదిక
X

కరోనా కాలంలో చేసేందుకు కూలి లేక, పరిశ్రమలు మూతపడి, ఉద్యోగాలు కోల్పోయి ఎంతో మంది ఆర్థికంగా చితికిపోయారు. కల్లోగంజో తాగి బతుకుదామంటూ లక్షలాది మంది సొంతూర్లకు తిరిగి వెళ్లిపోయారు. మరోవైపు అపర కుబేరుల సంపద మాత్రం కరోనా లాక్‌డౌన్ సమయంలో కూడా భారీగా పెరిగింది.

ప్రపంచ కుబేరుల్లో ఒకడైన ముఖేష్ అంబానీ సంపద గంటలకు రూ. 90 కోట్ల చొప్పున పెరిగిందని ఆక్స్‌ఫామ్ నివేదిక పేర్కొన్నది. ఏ నైపుణ్యం లేని కార్మికుడు కనీసం మూడేళ్ల పాటు ఎంత సంపాదించగలడో.. ముఖేష్ అంబానీ ఒక సెకనులో అంత సంపాదించినట్లు ఆ నివేదికలో స్పష్టం చేసింది. ఆక్స్‌ఫామ్ నివేదిక ప్రకారం ధనవంతుల సంపద వేగంగా పెరిగిన దేశాల ప్రకారం ఇండియా ఆరో స్థానంలో ఉన్నది.

మన కంటే ముందు అమెరికా, చైనా, జర్మనీ, రష్యా, ఫ్రాన్స్ ఉన్నాయి. మన దేశంలోని 100 మంది ధనవంతుల సంపద కరోనా సంక్షోభ సమయంలో రూ. 12 లక్షల కోట్ల మేర పెరిగినట్లు నివేదిక చెప్పింది. వీరిలో తొలి 11 మంది కుబేరుల సంపాదనతో జాతీయ ఉపాధి హామీ పథకాన్ని లేదా ఆరోగ్య శాఖను 10 ఏళ్ల పాటు సునాయాసంగా నిర్వహించవచ్చని పేర్కొన్నది.

మరోవైపు 100 మంది కుబేరులు మార్చి నుంచి సంపాదించిన మొత్తాన్ని కనుక దేశంలోని 13.8 కోట్ల మందికి పంచితే.. ఒక్కొక్కరికీ రూ. 94 వేలు ఇవ్వొచ్చని ఆ నివేదికలో తెలిపింది. దేశంలో నానాటికీ పెరుగుతున్న పేద-ధనిక అంతరం ఇలాగే కొనసాగితే మున్మందు మరిన్ని సంక్షోభాలు చూడాల్సి ఉంటుందని ఆక్స్‌ఫామ్ తెలిపింది.

First Published:  26 Jan 2021 7:32 AM GMT
Next Story