Telugu Global
NEWS

ఫైర్​బ్రాండ్​కు ప్రాణహానా.. ఎవరినుంచి..? ఆ లేఖ వెనుక ఆంతర్యం ఏమిటి?

తెలంగాణ ఫైర్​ బ్రాండ్​ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎంపీ రేవంత్​రెడ్డి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​పై విమర్శలు చేయడంలో రేవంత్​ ముందుంటారు. తరచూ వివాదాస్పద స్టేట్​మెంట్లు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం ఆయన స్టైల్​. రేవంత్​రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్​ కాబోతున్నరని కూడా కొంతకాలం క్రితం వార్తలు వినిపించాయి. ఆయన మాత్రం నాకు పీసీసీ వద్దు.. ప్రచారకమిటీ చైర్మన్​ ఇవ్వండి చాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్​ను బలోపేతం చేస్తానని […]

ఫైర్​బ్రాండ్​కు ప్రాణహానా.. ఎవరినుంచి..? ఆ లేఖ వెనుక ఆంతర్యం ఏమిటి?
X

తెలంగాణ ఫైర్​ బ్రాండ్​ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు ఎంపీ రేవంత్​రెడ్డి. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​గా ఉన్నారు. సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​పై విమర్శలు చేయడంలో రేవంత్​ ముందుంటారు. తరచూ వివాదాస్పద స్టేట్​మెంట్లు ఇవ్వడం.. వార్తల్లో నిలవడం ఆయన స్టైల్​.

రేవంత్​రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్​ కాబోతున్నరని కూడా కొంతకాలం క్రితం వార్తలు వినిపించాయి. ఆయన మాత్రం నాకు పీసీసీ వద్దు.. ప్రచారకమిటీ చైర్మన్​ ఇవ్వండి చాలు.. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి కాంగ్రెస్​ను బలోపేతం చేస్తానని ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా రేవంత్​రెడ్డి మరోసారి సంచలనంగా మారారు.

తనకు ప్రాణహాని ఉందని.. వెంటనే భద్రత పెంచాలని ఆయన ఏకంగా హోంమంత్రి అమిత్​ షాకు లేఖ రాశారు. ఈ లేఖ ఇప్పుడు హాట్​ టాపిక్​గా మారింది. తెలంగాణ ప్రభుత్వం నుంచే తనకు ముప్పు పొంచి ఉందని ఆయన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని తాను ప్రశ్నిస్తున్నానని.. అందుకే తనకు ముప్పు పొంచి ఉందని.. తన పై దాడిజరిగే ప్రమాదం ఉందని ఆయన కేంద్రానికి లేఖరాశారు.

గతంలో తనకు భద్రత పెంచాలని హైకోర్టు ఆదేశించినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఈ లేఖ ఇప్పుడు హాట్​టాపిక్​గా మారింది.

First Published:  4 Feb 2021 1:47 AM GMT
Next Story