రేవంత్ పాదయాత్ర.. ప్రభావమెంత?
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి.. ‘రాజీవ్ రైతు భరోసా యాత్ర’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. కానీ దాని వెనక రాజకీయ వ్యూహం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది. దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు రాబట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. […]
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి.. ‘రాజీవ్ రైతు భరోసా యాత్ర’ పేరుతో పాదయాత్రను ప్రారంభించారు. రైతు చట్టాలకు వ్యతిరేకంగా ఈ పాదయాత్ర చేస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. కానీ దాని వెనక రాజకీయ వ్యూహం దాగి ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ బలపడుతోంది.
దుబ్బాక ఉప ఎన్నికతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ మంచి ఫలితాలు రాబట్టింది. రాష్ట్రంలో టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయమని బీజేపీ చెప్పుకుంటున్నది. కాంగ్రెస్ పార్టీ తన ఉనికిని కాపాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నది. అయితే బీజేపీతో పొల్చితే నిజానికి కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా గట్టి పట్టు ఉంది.
కానీ వాళ్లను ముందుకు నడిపే నేతే లేరు. కాంగ్రెస్ కార్యకర్తల్లో నూతన ఉత్సాహం తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది. అందులో భాగంగా అధిష్ఠానం సూచన మేరకే రేవంత్ పాదయాత్రకు పూనుకున్నట్టు సమాచారం.
ఆయన గత ఆదివారం అచ్చంపేటలో రైతు భరోసా దీక్షకు కూర్చున్నారు. ఆ రోజు సాయంత్రం దీక్ష ముగిశాక సడెన్గా వ్యూహం మార్చి హైదరాబాద్ వరకు పాదయాత్రగా వెళతానని ప్రకటించారు.
ఆ తర్వాత ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలోని పలు గ్రామాలను టచ్ చేస్తూ ఆయన ముందుకు సాగుతున్నారు. అక్కడక్కడ బహిరంగ సభలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. రేవంత్ పాదయాత్రకు కొన్ని చోట్ల స్పందన బాగానే వస్తున్నది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒకప్పుడు కాంగ్రెస్ బలంగా ఉండేది. అయితే కాంగ్రెస్ నేతలంతా టీఆర్ఎస్, బీజేపీలో చేరిపోవడంతో ఆ పార్టీ ఖాళీ అయ్యింది. అయితే ఇప్పటికీ పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్కు బలమైన క్యాడర్ ఉంది.
ఇప్పుడు రేవంత్ పాదయాత్రతో క్యాడర్, లీడర్లు ఏకమవుతున్నారని సమాచారం. ఈ పాదయాత్రతో కాంగ్రెస్ బలపడటంతో పాటు రేవంత్రెడ్డికి కూడా ఇమేజ్ పెరుగుతోంది. రేవంత్రెడ్డి తన ప్రసంగాలతో ప్రజలను ఆకట్టుకుంటూ ముందుకు వెళ్తున్నారు. మరోవైపు అదే సమయంలో సీఎం కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్పై ఘాటైన విమర్శలు చేస్తున్నారు.రేవంత్రెడ్డి ఇప్పుడు కల్వకుర్తి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. దీని తర్వాత ఆయన రంగారెడ్డి జిల్లాకు ఎంట్రీ ఇవ్వనున్నారు.