Telugu Global
NEWS

మంత్రి పువ్వాడ ఇంట్లో బస చేయనున్న చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇంట్లో 8 రోజుల పాటు బస చేయనున్నారు. చిరంజీవి ఎందుకు మంత్రి ఇంట్లో బస చేయనున్నారంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. అయితే, ఆచార్యకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ను ఇల్లందులోని జేకే […]

మంత్రి పువ్వాడ ఇంట్లో బస చేయనున్న చిరంజీవి
X

మెగాస్టార్ చిరంజీవి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇంట్లో 8 రోజుల పాటు బస చేయనున్నారు. చిరంజీవి ఎందుకు మంత్రి ఇంట్లో బస చేయనున్నారంటే.. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో ‘ఆచార్య’ సినిమాలో నటిస్తున్నారు. దీనికి సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు.

అయితే, ఆచార్యకు సంబంధించిన ఒక షెడ్యూల్‌ను ఇల్లందులోని జేకే మైన్స్‌లో చిత్రీకరించాలని అనుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న ఈ మైన్స్ కోసం అనుమతులు అవసరం కావడంతో దర్శకుడు కొరటాల శివ మంత్రి పువ్వాడను కలిశారు. సింగరేణి గనుల్లో షూటింగ్‌కు అనుమతులు ఇప్పించాలని ఆయన కోరడంతో ఒక కండిషన్‌తో ఒప్పుకున్నారంట.

షూటింగ్ జరిగే 8 రోజులూ చిరంజీవిని ఖమ్మంలోని తన నివాసంలో ఉంచాలని ఆయన అడిగారట. దీంతో కొరటాల శివ కూడా ఓకే చెప్పడంతో మంత్రి పువ్వాడ కూడా సంతోషం వ్యక్తం చేశారు.

మార్చి 7 నుంచి 15 వరకు జేకే మైన్స్‌లో ఆచార్య షూటింగ్ జరుగనున్నది. పువ్వాడ అజయ్ కుమార్ అనుమతులు ఇప్పించడంతో కొరటాల శివ ఆయనకు థ్యాంక్స్ చెప్పారు. ఇటీవల ఆచార్య సెట్‌లో మంత్రి పువ్వాడ చిరంజీవిని కలవడం గమనార్హం.

First Published:  12 Feb 2021 7:51 AM GMT
Next Story