తెల్లవారితే గురువారం అంటున్నారు
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీసింహా కోడూరి నటిస్తోన్న రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. రిలీజ్ డేట్ పోస్టర్లో ఓ కారులో హీరో శ్రీసింహా కోడూరి మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటే, వారిని ఓరకంట చూస్తూ, అతని భార్య కారును డ్రైవ్ చేస్తోంది. భార్యాభర్తలిద్దరూ పెళ్లి దుస్తుల్లోనే ఉండటం విశేషం.. కారులోని మిర్రర్కు […]
సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కుమారుడు, ‘మత్తు వదలరా’ చిత్రంతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్న శ్రీసింహా కోడూరి నటిస్తోన్న రెండో చిత్రం ‘తెల్లవారితే గురువారం’. మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
రిలీజ్ డేట్ పోస్టర్లో ఓ కారులో హీరో శ్రీసింహా కోడూరి మరో అమ్మాయితో రొమాన్స్ చేస్తుంటే, వారిని ఓరకంట చూస్తూ, అతని భార్య కారును డ్రైవ్ చేస్తోంది. భార్యాభర్తలిద్దరూ పెళ్లి దుస్తుల్లోనే ఉండటం విశేషం.. కారులోని మిర్రర్కు డాక్టర్లు ఉపయోగించే స్టెతస్కోప్ ఉండటం ఇంకో హైలెట్.
శ్రీసింహా సరసన నాయికలుగా చిత్రా శుక్లా, మిషా నారంగ్ నటిస్తున్నారు.
ఈ చిత్రంతో మణికాంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. సాయి కొర్రపాటి సమర్పిస్తోన్న ఈ చిత్రాన్ని వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
‘కలర్ ఫొటో’తో లాక్డౌన్లో లౌక్య ఎంటర్టైన్మెంట్స్ సూపర్ హిట్ను అందించింది. తండ్రి ఎం.ఎం. కీరవాణి తరహాలో బాణీలు కడుతూ ప్రామిసింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా రాణిస్తున్న కాలభైరవ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది.