Telugu Global
International

హమ్మయ్య .. ఇక్కడైనా ట్రంప్​ పరువుదక్కింది..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్​ ట్రంప్​ జీర్ణించుకోలేకపోయారు. అసలు ఆయన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్​ విజయాన్ని అంగీకరించలేదు. చాలా అయిష్టంగా, ఓ రకంగా చెప్పాలంటే బలవంతంగా ఆయన వైట్​హౌస్​ను వదిలివెళ్లారు. ట్రంప్​ అమెరికా ఎన్నికల వ్యవస్థను, అక్కడి న్యాయస్థానాలను కూడా తప్పుపట్టారు. ఓ దశలో ట్రంప్​ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి తెగబడ్డారు. విధ్వంసాలు చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్​ పై కొత్త ప్రభుత్వం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ అభిశంసన విచారణలో […]

హమ్మయ్య .. ఇక్కడైనా ట్రంప్​ పరువుదక్కింది..!
X

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఓటమిని డొనాల్డ్​ ట్రంప్​ జీర్ణించుకోలేకపోయారు. అసలు ఆయన డెమోక్రాటిక్ అభ్యర్థి జో బైడెన్​ విజయాన్ని అంగీకరించలేదు. చాలా అయిష్టంగా, ఓ రకంగా చెప్పాలంటే బలవంతంగా ఆయన వైట్​హౌస్​ను వదిలివెళ్లారు.

ట్రంప్​ అమెరికా ఎన్నికల వ్యవస్థను, అక్కడి న్యాయస్థానాలను కూడా తప్పుపట్టారు. ఓ దశలో ట్రంప్​ మద్దతుదారులు అమెరికా పార్లమెంట్ భవనంపై దాడికి తెగబడ్డారు. విధ్వంసాలు చేశారు. దీంతో డొనాల్డ్ ట్రంప్​ పై కొత్త ప్రభుత్వం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టింది. అయితే ఈ అభిశంసన విచారణలో ట్రంప్​ బయటపడ్డారు. ఆయన మీద పెట్టిన అభిశంసన తీర్మానం వీగిపోయింది. ట్రంప్​పై అభిశంసన తీర్మానం నెగ్గాలంటే సెనేట్​లో మూడింట రెండొంతుల సభ్యుల మద్దతు తెలపాలి. కానీ సభ్యుల మద్దతు లేకపోవడంతో తీర్మానం వీగిపోయింది.

సెనేట్​లో 100 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ట్రంప్​పై పెట్టిన అభిశంసనకు అనుకూలంగా 57 మంది.. వ్యతిరేకంగా 43 మంది ఓటు వేశారు. దీంతో ట్రంప్​ అభిశంసన నుంచి బయటపడ్డారు. అయితే రిపబ్లికన్​ పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు కూడా ట్రంప్​కు వ్యతిరేకంగా ఓట్లేయడం గమనార్హం..

గత జనవరి 6న యూఎస్​ క్యాపిటల్​ భవనంపై ట్రంప్ మద్దతుదారులు దాడికి చేశారు. ఈ క్రమంలో ట్రంప్​ చేసిన పలు ట్వీట్లు కూడా వివాదాస్పదంగా మారాయి. ట్విట్టర్​ వాటిని తొలగించినప్పటికీ.. జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అభిశంసన విచారణ పలు కీలక మలుపులు తిరిగిన అనంతరం శనివారం తుది దశకు చేరుకున్నది.

First Published:  14 Feb 2021 1:30 AM GMT
Next Story