Telugu Global
NEWS

జానారెడ్డి గెలిస్తే.. పీసీసీ ఇచ్చేస్తారా? అధిష్ఠానం మదిలో ఏముంది?

తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు? చాలా కాలంగా ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఉత్తమ్​ కుమార్​రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్​ మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. దీంతో ఉత్తమ్​ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియ‌మిస్తారు? అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. ఇదిలా ఉంటే ఇప్పటికే రేవంత్​రెడ్డి, జీవన్​రెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. కానీ, జానారెడ్డి […]

జానారెడ్డి గెలిస్తే.. పీసీసీ ఇచ్చేస్తారా? అధిష్ఠానం మదిలో ఏముంది?
X

తెలంగాణ కొత్త పీసీసీ అధ్యక్షుడు ఎవరు? చాలా కాలంగా ఇది సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయింది. ఉత్తమ్​ కుమార్​రెడ్డి ఇప్పటికే పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. అయితే కాంగ్రెస్​ మాత్రం ఆయన రాజీనామాను ఆమోదించలేదు. దీంతో ఉత్తమ్​ ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే పీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియ‌మిస్తారు? అన్న విషయంపై చాలా కాలంగా చర్చ జరుగుతున్నది.

ఇదిలా ఉంటే ఇప్పటికే రేవంత్​రెడ్డి, జీవన్​రెడ్డి పేర్లు తెరమీదకు వచ్చాయి. కానీ, జానారెడ్డి సూచనతో పీసీసీ కొత్త అధ్యక్షుడి నియామకం పెండింగ్​లో పడిపోయింది. తాజాగా జానారెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఒకవేళ సాగర్​లో జానారెడ్డి గెలుపొందితే .. ఆయనకు పీసీసీ పీఠం కన్​ఫార్మ్​ అనే చర్చ నడుస్తోంది. జానారెడ్డి మాత్రం ప్రస్తుతం ‘సాగర్ బై ఎలక్షన్​’ పైనే ఫోకస్​ పెట్టారు. అక్కడ ఎలాగైనా గెలిచి పట్టు నిలబెట్టుకోవాలని చూస్తున్నారు.​ ఒకవేళ జానారెడ్డి కి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే కాంగ్రెస్​ పార్టీలోని వారంతా సైలెంట్​గా ఉండిపోయే అవకాశం ఉందని అధిష్ఠానం యోచి‌స్తుంద‌ట‌.

ఇప్పటికే చాలా సార్లు రేవంత్​రెడ్డికి పీసీసీ బాధ్యతలు అప్పగిస్తారని ప్రచారం జరిగింది. కానీ, కొందరు సీనియర్​ నేతలు మాత్రం.. రేవంత్​ పీసీసీ అధ్యక్షుడు కావడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆయనను పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే.. తాము పార్టీని వీడతామంటూ పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. దీంతో అధిష్ఠానం ఆలోచనలో పడింది.

కొంతకాలం పాటు జీవన్​రెడ్డి పేరు తెరమీదకు వచ్చింది. ఒక వేళ జీవన్​రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేస్తే వర్గపోరు తగ్గిపోవచ్చని ఆ పార్టీ భావించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా జానారెడ్డి పేరు ప్రచారంలోకి వచ్చింది. జానారెడ్డి కాంగ్రెస్​ పార్టీలో సీనియర్​ నేత. గతంలో ఆయన హోంశాఖ మంత్రిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్​ శాసనసభాపక్షనేతగానూ వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా వ్యవహరించారు. కీలక సమయంలో ఉద్యమానికి మద్దతు ఇచ్చారు.

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి జానారెడ్డే అనే ప్రచారం కూడా సాగింది. జానారెడ్డి తొలుత టీడీపీలో ఉన్నప్పటికీ ఆ తర్వాత కాంగ్రెస్​లో చేరి కీలకనేతగా ఎదిగారు. ఒకవేళ ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేస్తే.. కాంగ్రెస్​లో అసంతృప్తులు చల్లారవచ్చని ఆ పార్టీ భావిస్తున్నదట. సాగర్​లో గనక జానారెడ్డి గెలిస్తే ఆయనను పీసీసీ అధ్యక్షుడిని చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

First Published:  31 March 2021 7:04 AM GMT
Next Story