Telugu Global
Andhra Pradesh

బాలకృష్ణ మొన్న తొడగొట్టాడు.. నేడు తోక ముడిచాడు..

రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదని.. పనికిమాలిన పార్టీ అని మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబు చీటర్‌ అని, ముఖ్యమంత్రి జగన్‌ లీడర్‌ అని అన్నారు.

బాలకృష్ణ మొన్న తొడగొట్టాడు.. నేడు తోక ముడిచాడు..
X

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అంశంలో చర్చకు రావాలని ప్రభుత్వం ఆహ్వానిస్తే ప్రతిపక్ష టీడీపీ పలాయనం చిత్తగించిందని మంత్రి రోజా అన్నారు. మహిళా సాధికారతపై ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో చేపట్టిన స్వల్పకాలిక చర్చా కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. మొన్న అసెంబ్లీ సమావేశాల్లో తొడగొట్టిన టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. నేడు తోక ముడిచారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు.

సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై బాలకృష్ణ చర్చకు రాగలరా..? అని ఈ సందర్భంగా ఆమె ప్రశ్నించారు. రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయమనే సునామీ దెబ్బకు చంద్రబాబు, పవన్‌ కల్యాణ్, లోకేశ్‌ సముద్రపు అలల్లో కొట్టుకుపోతారని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో టీడీపీ ప్రతిపక్ష పార్టీ కాదని.. పనికిమాలిన పార్టీ అని మంత్రి రోజా ఆరోపించారు. చంద్రబాబు చీటర్‌ అని, ముఖ్యమంత్రి జగన్‌ లీడర్‌ అని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్లలో మహిళల కోసం ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. ఆడపుట్టుకనే ఎగతాళి చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సీఎం జగన్‌ పాలనలో మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్నారన్నారు. చంద్రబాబును ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పటికీ నమ్మరని చెప్పారు.

చంద్రబాబు చెప్పేవన్నీ మాయమాటలని మహిళలకు తెలుసని, దేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఏపీలో మహిళలకు రాజకీయంగా సీఎం జగన్‌ అవకాశాలు కల్పించారని వివరించారు. రాష్ట్రంలోని ప్రతి పేదింటి ఆడబిడ్డకూ సీఎం వైఎస్‌ జగన్‌ అండగా ఉన్నారని చెప్పారు. నాలుగున్నరేళ్లలో ప్రతీ ఆడబిడ్డ కన్నీళ్లు తుడిచారని మంత్రి రోజా అన్నారు.

First Published:  25 Sep 2023 1:08 PM GMT
Next Story