Telugu Global
Andhra Pradesh

ముసలి బాబూ.. నా కొడుకుపై నిందలేస్తావా..?

బూతులు మాట్లాడినందుకే తనకు మంత్రి పదవి వచ్చిందని కూడా చంద్రబాబు అబద్ధాలు చెబుతున్నారని, తాను బూతులు మాట్లాడినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు పేర్ని నాని.

ముసలి బాబూ.. నా కొడుకుపై నిందలేస్తావా..?
X

తన కొడుకు తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తుంటే ముసలి చంద్రబాబు.. అసత్య ప్రచారం చేస్తున్నారని, గంజాయి అమ్ముతున్నారంటూ నిందలు వేస్తున్నారని మండిపడ్డారు పేర్ని నాని. తనకు బూతులు మాట్లాడినందుకే మంత్రి పదవి వచ్చిందని కూడా బాబు అబద్ధాలు చెబుతున్నారని, తాను బూతులు మాట్లాడినట్టు నిరూపించాలని సవాల్ విసిరారు. మచిలీపట్నంలో చంద్రబాబు ప్రతి మాటా అబద్ధమేనన్నారు నాని.

జడ్జితో మాట్లాడి తోట త్రిమూర్తులుకి బెయిల్‌ ఇప్పించారని చంద్రబాబు అనడం పచ్చి అబద్ధమన్నారు నాని. శిరోముండనం కేసు 1996లో జరిగిందని, ఆ ఘటన జరిగినప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీలోనే ఉన్నారు కదా అని ప్రశ్నించారు. ఆ కేసులో ముద్దాయిగా ఉన్నప్పుడు తోట త్రిమూర్తులు టీడీపీ నుంచి పోటీ చేశారని, ఇప్పుడు వైసీపీ నుంచి పోటీ చేస్తుంటే చంద్రబాబు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబులాగా అసహ్యంగా మాట్లాడే నాయకులు ఎవరూ ఉండరన్నారు పేర్ని నాని.

చంద్రబాబుకు వయసు పెరిగింది కానీ.. ఏం మాట్లాడాలో తెలియలేదని విమర్శించారు పేర్ని నాని. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు బందరుకి ఏం చేశారని ప్రశ్నించారు. బందరుకి పూర్వవైభవం రావడానికి కారణం సీఎం జగన్ అని పేర్ని నాని తెలిపారు. కృష్ణా వర్శిటీ, పాలిటెక్నిక్‌ కాలేజీలు నిర్మించామన్నారు. పోర్టు పనులు శరవేగంగా జరిగేలా చూస్తున్నామన్నారు. 26వేల మంది నిరుపేదలకు ఇళ్ల పట్టాలిచ్చామని పేర్కొన్నారు. కరోనా సమయంలో తన కొడుకు పేదలకు సేవ చేశారని గుర్తు చేశారు. మొదటి సారి పోటీ చేస్తున్న తన కొడుకుని ఆశీర్వదించాలన్నారు పేర్ని నాని.

First Published:  18 April 2024 1:46 PM GMT
Next Story