Telugu Global
Andhra Pradesh

పల్నాడు జిల్లాలో టెన్షన్‌.. ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యపై దాడి

దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించి వెల్దుర్తి SI శ్రీహరిపైనా టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు.

పల్నాడు జిల్లాలో టెన్షన్‌.. ఎమ్మెల్యే పిన్నెల్లి భార్యపై దాడి
X

పల్నాడు జిల్లాలో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. టీడీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. వెల్దుర్తి మండలం సిరిగిరిపాడులో వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగారు. వృద్ధులకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌ ప్రక్రియలో ఉన్న వైసీపీ ఏజెంట్లపై రాళ్లతో దాడి చేశారు.

అదే గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి భార్య రమాదేవిపైనా దాడి చేశారు. ఈ దాడిలో రమాదేవి సహా పలువురు మహిళా కార్యకర్తల తలలకు గాయాలయ్యాయి. వైసీపీ నేతలకు చెందిన వాహనాలను ధ్వంసం చేశారు. దాడులను అడ్డుకునేందుకు ప్రయత్నించి వెల్దుర్తి SI శ్రీహరిపైనా టీడీపీ నేతలు దాడులకు తెగబడ్డారు.

ఎన్నికల్లో ఓటమి తప్పదన్న ఫ్రస్టేషన్‌తోనే తెలుగుదేశం నేతలు దాడులకు పాల్పడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

First Published:  8 May 2024 4:42 PM GMT
Next Story