Telugu Global
Andhra Pradesh

చంద్ర‌బాబుపై సజ్జల ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌

చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని సజ్జల తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు.

చంద్ర‌బాబుపై సజ్జల ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌
X

ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆసక్తికరమైన కామెంట్లు చేశారు. చంద్రబాబు నాయుడు నకిలీ నోటు అని ప్రజలకు తెలుసని ఆయన చెప్పారు. నోటుపై ఎలాంటి ముద్ర ఉన్నా ఏది ఉన్నా.. నోటు నకిలీది అని తెలిసిన తర్వాత ప్రజలు ఎవరూ అలాంటి నోటును కావాలనుకోరని ఆయన తెలిపారు. అందుకే చంద్రబాబును కూడా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు వస్తే సంక్షేమ పథకాలు నిలిచిపోతాయని, మళ్లీ జన్మభూమి కమిటీలు వస్తాయని ప్రజలకు తెలుసన్నారు. గతంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలు మర్చిపోలేదని ఆయన చెప్పారు. తాడేపల్లిలో గురువారం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

జనం వారిని చెత్తబుట్టలో వేశారు..

చంద్రబాబును, టీడీపీని ప్రజలు చెత్తబుట్టలో వేశారని సజ్జల తెలిపారు. ప్రజల్లోకి వెళ్లి ఏం చెప్పాలో చంద్రబాబుకు తెలియడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. కూటమిలో భాగంగా సీట్లు కేటాయించినా.. అభ్యర్థులుగా మాత్రం బీజేపీలో ఉన్న టీడీపీ నేతలకే చంద్రబాబు ఇప్పించారని ఆయన గుర్తుచేశారు. చంద్రబాబు సభలకు జనం రావడం లేదని ఈ సందర్భంగా ఆయన చెప్పారు.

పాంట్రీ కారుపైనా తప్పుడు ప్రచారమే..

పాంట్రీ కారుపై కూడా టీడీపీ నేతలు, ఎల్లో మీడియా అసత్య ప్రచారం చేయడంపై సజ్జల ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని అనుమతులూ తీసుకున్న పాంట్రీ కారుపైనా తప్పుడు ప్రచారం చేశారని విమర్శించారు. గతంలో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజలను మోసం చేశారని సజ్జల మండిపడ్డారు. మళ్లీ ఇప్పుడు అదే తీరులో మోసపూరిత హామీలతో చంద్రబాబు వస్తున్నారని ఆయన చెప్పారు. ఏ పార్టీ వైపు ఉండాలో ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి విషయంలో వైసీపీ స్పష్టమైన అజెండాతో ఉందని సజ్జల చెప్పారు. ఆ విషయం ప్రజలకు కూడా తెలుసని ఆయన తెలిపారు.

First Published:  28 March 2024 9:38 AM GMT
Next Story