Telugu Global
Andhra Pradesh

సీఎం ఆఫీసుకు కంటెయినర్‌.. సస్పెన్స్‌కు తెరదించిన వైసీపీ

ఈ అంశంపై వైసీపీ సోషల్ మీడియా తాజాగా స్పందించింది. ఆ కంటెయినర్.. వంట సామాన్లను తీసుకెళ్లిందని.. అది పాంట్రీ వాహ‌నం అని స్పష్టం చేస్తూ వీడియో పోస్ట్ చేసింది.

సీఎం ఆఫీసుకు కంటెయినర్‌.. సస్పెన్స్‌కు తెరదించిన వైసీపీ
X

ఏపీలో కంటెయినర్‌ పాలిటిక్స్ ఇంట్రెస్టింగ్‌గా మారాయి. మంగళవారం సీఎం క్యాంపు ఆఫీసుకు ఓ కంటెయినర్ రావడంతో టీడీపీ గగ్గోలు పెట్టింది. కంటెయినర్‌లో భారీగా డబ్బు తరలిస్తున్నారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపణలు, విమర్శలు మొదలుపెట్టారు. సోషల్‌మీడియా వేదికగా కంటెయినర్‌కు సంబంధించి నానా యాగీ చేశారు. ఇక పచ్చ మీడియా సైతం కంటెయినర్‌ కలకలం అంటూ దుష్ప్రచారం మొదలు పెట్టింది.

అయితే ఈ అంశంపై వైసీపీ సోషల్ మీడియా తాజాగా స్పందించింది. ఆ కంటెయినర్.. వంట సామాన్లను తీసుకెళ్లిందని.. అది పాంట్రీ వాహ‌నం అని స్పష్టం చేస్తూ వీడియో పోస్ట్ చేసింది. సీఎం జగన్ మేమంతా సిద్దం బస్సు యాత్ర నేపథ్యంలో ఆహారాన్ని తయారు చేసుకునేందుకు తీసుకువచ్చిన పాంట్రీ వ్యాన్‌ అంటూ క్లారిటీ ఇచ్చింది వైసీపీ. ఈటీవీ ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన వార్తకు, వాస్తవానికి తేడా ఇదంటూ ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేసింది. దీంతో కంటెయినర్ మిస్టరీ వీడినట్లయింది.

First Published:  27 March 2024 11:59 AM GMT
Next Story