Telugu Global
Cinema & Entertainment

క్రేజీ ఫెలో ట్రయిలర్ ఎలా ఉందంటే..!

ఆది సాయికుమార్ తాజా చిత్రం క్రేజీ ఫెలో. ఈ మూవీ ట్రయిలర్ రిలీజైంది. ఈసారి ఆది ఎలాంటి కథను ఎంచుకున్నాడో చూద్దాం..

క్రేజీ ఫెలో ట్రయిలర్ ఎలా ఉందంటే..!
X

ఆది సాయికుమార్ కొత్త సినిమా క్రేజీ ఫెలో. సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై రాధామోహన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ఫణి కృష్ణ దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. 'క్రేజీ ఫెలో' టైటిల్ కి తగ్గట్టే ట్రైలర్ చాలా క్రేజీగా ఉంది. ఫ్యామిలీ, ఫన్, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ట్రైలర్ లో.

'మావాడు చాలా మారిపోయాడు. ఇంతకుముందులా లేడు'అని అనీష్ కురువిల్లా, సప్తగిరికి చెప్పిన తర్వాత.. డాక్టర్ సమరానికి ఎవరో రాసిన ఉత్తరం చదువుతూ ఆది పాత్ర రివీల్ కావడం చాలా క్రేజీగా ఉంది. తర్వాత ఫ్రెండ్స్, ఆఫీస్ లో వచ్చిన కొన్ని సీన్స్ కంప్లీట్ ఫన్ మోడ్ లో ఉన్నాయి.

ట్రైలర్ లో బాలత్రిపుర సుందరి పాట ఆకట్టుకుంది. తర్వాత వచ్చిన యాక్షన్, ఎమోషనల్ సీన్స్ క్రేజీ ఫెలో కథపై ఆసక్తిని పెంచాయి. ఇక ట్రైలర్ చివర్లో 'పుణ్యానికి పొతే పాప ఎదురైంది'' అని ఆది చెప్పిన డైలాగ్ హిలేరియస్ గా ఉంది.

ట్రైలర్ లో ఆది ఎనర్జిటిక్ గా కనిపించాడు. హీరోయిన్లు దిగంగనా సూర్యవంశీ, మర్నా మీనన్ అందంగా కనిపించారు. సతీష్ ముత్యాల కెమెరా పనితనం, ధృవన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. అక్టోబర్ 14న థియేటర్లలోకి వస్తున్నాడు క్రేజీ ఫెలో.



First Published:  2 Oct 2022 11:27 AM GMT
Next Story