Telugu Global
Cinema & Entertainment

Kamal Haasan-Mani Ratnam: 35 ఏళ్ల తర్వాత కమల్ - మణిరత్నం కాంబినేషన్‌లో మూవీ

Kamal Haasan-Mani Ratnam: కమల్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

Kamal Haasan-Mani Ratnam: 35 ఏళ్ల తర్వాత కమల్ - మణిరత్నం కాంబినేషన్‌లో మూవీ
X

కమలహాసన్ - మణిరత్నం కాంబినేషన్లో 1987లో విడుదలైన సినిమా నాయకన్. కమల్, మణిరత్నం కెరీర్‌లలోనే అత్యంత భారీ హిట్ సినిమాగా ఈ మూవీ నిలిచింది. క్లాసిక్ చిత్రాల జాబితాలో ఈ సినిమా ఎప్పుడూ ముందు ఉంటుంది. తెలుగులో ఈ సినిమా నాయకుడుగా విడుదలై ఇక్కడ కూడా సంచలన విజయాన్ని నమోదు చేసింది. నాయకుడు అంత పెద్ద హిట్టు అయినప్పటికీ కమల్ - మణిరత్నం కాంబినేషన్లో మళ్లీ సినిమా తెరకెక్కలేదు.

35 సంవత్సరాల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా రానుంది. దీనికి సంబంధించి మణిరత్నం అధికారికంగా ప్రకటించాడు. కమల్ సొంత నిర్మాణ సంస్థ అయిన రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్, మద్రాస్ టాకీస్, రెడ్ జెయింట్ మూవీస్ సంయుక్తంగా ఈ సినిమాను రూపొందించనున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.

ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత మణిరత్నంతో సినిమా ప్రారంభం కానుంది. ఈ మూవీని 2024లో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. కమల్ - మణిరత్నం కాంబినేషన్‌లో 35 ఏళ్ల తర్వాత ఓ సినిమా రానుండడంతో కమల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

First Published:  7 Nov 2022 6:12 AM GMT
Next Story