Telugu Global
Cinema & Entertainment

VYOOHAM | వర్మ తీసిన వ్యూహం ట్రయిలర్ ఎలా ఉందంటే..?

VYOOHAM Movie Trailer - ఈసారి వ్యూహం సినిమాతో రెడీ అయ్యాడు వర్మ. సీఎం జగన్ రియల్ లైఫ్ స్టోరీని తెరపైకి తీసుకొస్తున్నాడు. తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశాడు.

VYOOHAM | వర్మ తీసిన వ్యూహం ట్రయిలర్ ఎలా ఉందంటే..?
X

ఎన్నో రాజకీయ కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొని ముఖ్యమంత్రిగా ఎదిగిన వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ వ్యూహం సినిమాను రూపొందిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్‌ నటిస్తుండగా...వైఎస్ భారతి పాత్రలో మానస నటిస్తున్నారు.

వ్యూహం సినిమాను నవంబర్ 10న థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి తాజాగా ట్రయిలర్ రిలీజ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు అద్దం పట్టే చాలా పాత్రలు, ఘటనలు వ్యూహం ట్రయిలర్ లో కనిపించాయి. జగన్, చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను పోలిన పాత్రలు కూడా ఉన్నాయి.

అంతేకాదు, ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిన స్కిల్ స్కామ్ అంశం కూడా వ్యూహంలో ప్రస్తావనకు రావడం విశేషం. తన తాజా చిత్రంపై వర్మ స్పందించాడు. ప్రజలకు తెలిసిన విషయాలు కాకుండా, తెరవెనక ఏం జరిగి ఉండొచ్చనే ఆలోచనతో ఈ సినిమా తీశానని అంటున్నాడు.

"నేను డైరెక్ట్ చేసే సినిమాలన్నింటిలో 80శాతం ఏదో ఒక ఇన్సిడెంట్ ఇన్సిపిరేషన్ తోనే రూపొందిస్తాను. ఈ కథలో వైఎస్ మృతి నుంచి నేటి వరకు జరిగిన ముఖ్య సంఘటనలు ఉంటాయి. అయితే అది ప్రజలందరికీ తెలిసిన విషయాలు కావు. ఇన్ సైడ్ జరిగిన విషయాలన్నీ ఈ సినిమాలో చూపిస్తున్నాం. ఒక పెద్ద నిర్ణయం జరిగినప్పుడు దాని వెనక ఎన్నో ఆలోచనలు జరుగుతాయి. అవి బయటకు తెలియవు. ఈ మొత్తం ఇన్సిడెంట్స్ లో ఉన్న వారి దగ్గర నుంచి సమాచారం సేకరించాను. ఆ సమాచారం ఆధారంగా ప్రేక్షకులకు నచ్చే ఒక సినిమాటిక్ ఫార్మేట్ లో వ్యూహం సినిమాను రూపొందించాను."

వ్యూహంతో పాటు శపథం అనే మరో సినిమాను కూడా రూపొందిస్తున్నాడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, వ్యూహం సినిమాకు కొనసాగింపుగా వచ్చే చిత్రం అది. దాని షూటింగ్ కూడా నడుస్తోంది. శపథం సినిమాను జనవరి 25న రిలీజ్ చేస్తున్నారు.

First Published:  14 Oct 2023 8:15 AM GMT
Next Story