Telugu Global
CRIME

సోదరితో అక్రమ సంబంధం.. ప్రశ్నించిన తల్లికి ఉరేసిన అన్నా చెల్లెలు

సమాజంలో మానవ సంబంధాలు నానాటికి దిగజారి పోతున్నాయి. వావివరసలు మరచి లైంగిక సంబంధాలు సాగించడం ఇటీవలి కాలంలో అధికమైంది.

సోదరితో అక్రమ సంబంధం.. ప్రశ్నించిన తల్లికి ఉరేసిన  అన్నా చెల్లెలు
X

సమాజంలో మానవ సంబంధాలు నానాటికి దిగజారి పోతున్నాయి. వావివరసలు మరచి లైంగిక సంబంధాలు సాగించడం ఇటీవలి కాలంలో అధికమైంది. మహారాష్ట్రలో ఒక యువకుడు(29) తన సోదరి(30) తో అక్రమ సంబంధం పెట్టుకోగా.. ఇది తెలుసుకున్న తల్లి ప్రశ్నించడంతో అన్నా చెల్లెలు కలిసి ఆమెకు ఉరివేసి హత్య చేశారు. ఈ దారుణ సంఘటన థానే జిల్లా భీవండి పట్టణంలో జరిగింది.

పట్టణానికి చెందిన 29 ఏళ్ల కొడుకు తల్లితో కలిసి ఉంటున్నాడు. తండ్రి కొన్నేళ్ల కిందటే మరణించాడు. కాగా తండ్రి సోదరుడి కుమార్తె కూడా కొంతకాలంగా వీరితో కలిసి ఉంటోంది. అయితే కొన్ని రోజులుగా అన్నాచెల్లెలు చనువుగా మెలుగుతూ ఉండడం తల్లి గుర్తించింది. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉన్నట్లు తెలుసుకుంది. వావి వరసలు మరచి సంబంధం పెట్టుకోవడం పై ఇద్దరికీ బుద్ధి చెప్పింది. ఇద్దరి మధ్య ఏర్పడ్డ సంబంధానికి స్వస్తి పలకాలని హెచ్చరించింది.

ఈ విషయమై ఆమె తరచూ అన్నా చెల్లెలిని మందలించేది. తమ సంబంధానికి అడ్డుగా ఉన్న తల్లిని ఎలాగైనా తొలగించుకోవాలని అన్నా చెల్లెలు నిర్ణయించుకున్నారు. బెల్ట్ ని తల్లి మెడకు చుట్టి ఆమెని చంపేశారు. అయితే ఆమె ప్రమాదవశాత్తూ మరణించిందని పోలీసులను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఆమె ఒంటిపై ఉన్న గాయాలను బట్టి అది కచ్చితంగా హత్య అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. తమదైన శైలిలో అన్నాచెల్లెలిని విచారించగా వారు నేరాన్ని అంగీకరించారు. వారిద్దరిపై ఐపీసీ లోని సెక్షన్ 302, 34ల కింద కేసు నమోదు చేసినట్లు నార్పోలి పోలీస్ ఇన్ స్పెక్టర్ మదన్ బలాల్ తెలిపారు.

First Published:  22 Sep 2022 9:45 AM GMT
Next Story