Telugu Global
CRIME

విజ‌య‌వాడ‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

విజ‌య‌వాడ‌లో విషాదం చోటుచేసుకుంది. గురునాన‌క్‌న‌గ‌ర్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్ట‌ర్ శ్రీనివాస్, ఆయ‌న కుటుంబంలో మ‌రో న‌లుగురు ఒకేసారి మృతి చెందారు.

విజ‌య‌వాడ‌లో విషాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
X

విజ‌య‌వాడ‌లో విషాదం చోటుచేసుకుంది. గురునాన‌క్‌న‌గ‌ర్‌కు చెందిన ఆర్థోపెడిక్ డాక్ట‌ర్ శ్రీనివాస్, ఆయ‌న కుటుంబంలో మ‌రో న‌లుగురు ఒకేసారి మృతి చెందారు. ఇవి ఆత్మ‌హ‌త్య‌లా, హ‌త్య‌లా అనేది అనుమానంగా ఉంది. దీంతో అనుమానాస్ప‌ద మృతిలుగా కేసు న‌మోదు చేసి, విచార‌ణ ప్రారంభించిన‌ట్లు పోలీసులు చెప్పారు.

ఇంటి బ‌య‌ట ఉరేసుకున్న డాక్ట‌ర్‌

డాక్ట‌ర్ శ్రీ‌నివాస్ ఇంటి బ‌య‌ట ఉరేసుకుని క‌నిపించారు. దీంతో స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. వారు వ‌చ్చి త‌లుపులు తెరిచి చూడగా.. ఓ మ‌హిళ‌, ఇద్ద‌రు పిల్ల‌లు, ఓ వృద్ధురాలి మృత‌దేహాలు క‌నిపించాయి. వీరు శ్రీ‌నివాస్ భార్య, పిల్ల‌లు, త‌ల్లి అని పోలీసులు భావిస్తున్నారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ రామ‌కృష్ణ ఘ‌ట‌నా స్థలానికి వ‌చ్చి ప‌రిశీలించారు.

First Published:  30 April 2024 8:17 AM GMT
Next Story