Telugu Global
CRIME

బాలుడిని చంపి, యువకుడి ఆత్మహత్య, దొంగతనం చేస్తుండగా తనను పట్టించాడనే

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణ సంఘటన జరిగింది. దొంగతనం చేస్తుండగా పట్టించాడని శేఖర్ అనే బాలుడిని నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. తరువాత సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

బాలుడిని చంపి, యువకుడి ఆత్మహత్య, దొంగతనం చేస్తుండగా తనను పట్టించాడనే
X

సంగారెడ్డి జిల్లా అందోల్‌ మండలం జోగిపేటలో దారుణ సంఘటన జరిగింది. దొంగతనం చేస్తుండగా పట్టించాడని శేఖర్ అనే బాలుడిని నాగరాజు అనే వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. తరువాత సెల్‌టవర్‌పైనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

వివరాల్లోకి వెళితే జోగిపేట పట్టణంలో ఓ దుకాణంలో నాగరాజు కేబుల్‌ వైర్లు చోరీ చేశాడు. శేఖర్ అనే బాలుడు దానిని చూసి నాగరాజును స్థానికులకు పట్టించాడు. దీనితో శేఖర్ పై కక్ష పెంచుకున్న నాగరాజు. శనివారం రాత్రి మాట్లాడాలని పిలిచి హత్య చేసి బావిలో పారేశాడు. అదే సమయంలో డబ్బులు అడిగితే ఇవ్వలేదని ఓ వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు.

ఆదివారం ఉదయం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తుండగానే నాగరాజు తానే హత్య చేసినట్లు పోలీసులకు ఫోన్ చేసి నేరం ఒప్పుకొని సెల్ టవర్ ఎక్కాడు. బాలుడి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితుడు సెల్ టవర్ మీద ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు, బాలుడి బంధువులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకోవడంతో దాడి చేస్తారేమోనని భయపడిన నాగరాజు సెల్‌ టవర్‌ ఎక్కడు. ఉదయం నుంచి అక్కడే ఉన్నాడు. సమాయం గడుస్తున్నా ఉలుకు పలుకు లేకపోవడంతో డ్రోన్ కెమెరాతో నాగరాజు కదలికలను పోలీసులు గమనిస్తుండగా.. నాగరాజు కేబుల్ వైర్లతో ఉరేసుకున్న దృశ్యం కనిపించింది. నాగరాజుపై గతంలో చాలా కేసులు ఉన్నట్టు సమాచారం. వ్యాపారులు, దుకాణదారులపై దాడులకు పాల్పడుతూ డబ్బులు తీసుకునేవాడని స్థానికులు చెబుతున్నారు.

First Published:  21 April 2024 11:45 AM GMT
Next Story