Telugu Global
NEWS

ఓటేసేందుకు వెళ్లేవారికి అభీబ‌స్ ఆఫ‌ర్‌.. బ‌స్ టికెట్ల‌లో రూ.250 వ‌ర‌కు డిస్కౌంట్‌

అభిఓట్ (ABHIVOTE) అనే కూప‌న్ అప్ల‌యి చేసి, క‌నీసం 20% డిస్కౌంట్ పొంద‌వ‌చ్చ‌న్నారు. గ‌రిష్ఠంగా టికెట్ ధ‌ర‌లో రూ.250 వ‌ర‌కు రాయితీ పొంద‌వ‌చ్చ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు.

ఓటేసేందుకు వెళ్లేవారికి అభీబ‌స్ ఆఫ‌ర్‌.. బ‌స్ టికెట్ల‌లో రూ.250 వ‌ర‌కు డిస్కౌంట్‌
X

ప్రైవేట్ బ‌స్ అగ్రిగేట‌ర్ అభీబ‌స్ తెలుగు రాష్ట్రాల్లో ఓటేసేందుకు వెళ్లేవారికి బంప‌ర్ ఆఫ‌ర్ ప్ర‌క‌టించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ నెల 11 నుంచి 15 మ‌ధ్య అభీబ‌స్‌లో టికెట్లు బుక్ చేసేవారికి టికెట్ ధ‌ర‌లో రూ.250 వ‌ర‌కు రాయితీ ఇస్తామ‌ని చెప్పింది. తెలుగు రాష్ట్రాల్లో ఓటేసేందుకు వెళ్లేవారికి ఈ ఆఫ‌ర్ ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని అభీబ‌స్ సీఈవో లెనిన్ కోడూరు, సీవోవో రోహిత్ శ‌ర్మ ఓ ప్ర‌క‌ట‌న‌లో చెప్పారు.

అభిఓట్ కూపన్ అప్ల‌యి చేస్తే రాయితీ

అభిఓట్ (ABHIVOTE) అనే కూప‌న్ అప్ల‌యి చేసి, క‌నీసం 20% డిస్కౌంట్ పొంద‌వ‌చ్చ‌న్నారు. గ‌రిష్ఠంగా టికెట్ ధ‌ర‌లో రూ.250 వ‌ర‌కు రాయితీ పొంద‌వ‌చ్చ‌ని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. దీంతో పాటు రూ.100 క్యాష్‌బ్యాక్ కూడా పొంద‌వ‌చ్చ‌ని చెప్పారు. ఈ క్యాష్ బ్యాక్‌ను త‌ర్వాత‌యినా అభిబ‌స్‌లో టికెట్ బుక్ చేసుకునేట‌ప్పుడు వాడుకోవ‌చ్చు.

టీఎస్ఆర్టీసీ ఇప్ప‌టికే ఆఫ‌ర్ ప్ర‌క‌ట‌న‌

ఆంధ్ర‌ప్రాంతానికి ఓటేసేందుకు వెళ్లేవారి కోసం టీఎస్ ఆర్టీసీ ఇప్ప‌టికే 10% రాయితీ ప్ర‌క‌టించింది. అయితే ఓటేసేందుకు మాత్రమే కాదు వేస‌విలో ప్ర‌యాణం చేసేవారికి కూడా ఈ ఆఫ‌ర్ వ‌ర్తిస్తుంది. హైద‌రాబాద్‌- విజ‌య‌వాడ మార్గంలో ఈ ఆఫ‌ర్ ఉంటుంది.

First Published:  2 May 2024 9:54 AM GMT
Next Story