Telugu Global
National

ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం.. తర్వాత ఊహించని ట్విస్ట్

భార్యతో వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న షాహిబ్‌ఖాన్‌.. సచిన్‌ హత్యకు స్కెచ్ వేశాడు. భార్యతో బలవంతంగా ఫోన్‌ చేయించి సచిన్‌ను ఇంటికి రప్పించాడు.

ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం.. తర్వాత ఊహించని ట్విస్ట్
X

ఓనర్ భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. తను పనిచేసిన కంపెనీ యజమానే అతన్ని దారుణంగా పొడిచి చంపాడు. ఢిల్లీలోని సంగమ్‌ విహార్‌లో ఈ ఘటన జరిగింది. మ్యాటర్‌లోకి వెళ్తే.. ప్రస్తుతం ఢిల్లీలోని కన్నాట్‌ప్లేస్‌లోని ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా పనిచేస్తున్న సచిన్‌ కుమార్‌(22).. అంతకుముందు సంగమ్‌ విహార్‌లో షాహిబ్‌ ఖాన్‌కు చెందిన టీ-షర్టుల తయారీ కంపెనీలో పనిచేసేవాడు. గత ఆదివారం రాత్రి నుంచి అతను కనిపించకుండా పోయాడు. దాంతో సచిన్‌ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సచిన్‌ ఫోన్‌ కాల్‌ డేటా ఆధారంగా ఎంక్వయిరీ మొదలు పెట్టారు.

పోలీసుల విచారణలో మాజీ కంపెనీ యజమాని షాహిబ్‌ ఖాన్‌ భార్య షబీనా బేగంతో సచిన్‌కు వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. అంతేగాక షాహిబ్‌ ఖాన్‌ దగ్గర రూ.2 లక్షలు అప్పు కూడా తీసుకున్నట్లు గుర్తించారు. కంపెనీ మారిన సచిన్‌ను షాహిబ్‌ ఖాన్‌ అప్పు కోసం ఒత్తిడి చేయడంతో రూ. లక్ష చెల్లించాడు. మిగతా లక్ష కోసం అడిగినా లెక్క చేయడంలేదు. ఈ క్రమంలో సచిన్‌ హత్యకు షాహిబ్‌ కుట్రపన్నాడు.

భార్యతో వివాహేతర సంబంధం గురించి తెలుసుకున్న షాహిబ్‌ఖాన్‌.. సచిన్‌ హత్యకు స్కెచ్ వేశాడు. భార్యతో బలవంతంగా ఫోన్‌ చేయించి సచిన్‌ను ఇంటికి రప్పించాడు. సచిన్‌ ఇంట్లోకి రాగానే కత్తితో విచక్షణారహితంగా పొడిచి చంపాడు. అనంతరం మృతదేహాన్ని కారులో తీసుకెళ్లి దస్నా ఏరియాలోని అటవీ ప్రాంతంలో పడేశారు. నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు వాళ్లు ఇచ్చిన సమాచారం మేరకు సచిన్‌ డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు.

First Published:  6 April 2024 3:03 AM GMT
Next Story