Telugu Global
National

క‌ర్నాట‌క‌లో జేడీ(ఎస్) త‌ర‌ఫున కేసీఆర్ ప్ర‌చారం.. - దేవెగౌడ వెల్ల‌డి

క‌ర్నాట‌కలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జ‌నతాద‌ళ్ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని తాము భావిస్తున్నామ‌ని దేవెగౌడ చెప్పారు.

క‌ర్నాట‌క‌లో జేడీ(ఎస్) త‌ర‌ఫున కేసీఆర్ ప్ర‌చారం.. - దేవెగౌడ వెల్ల‌డి
X

క‌ర్నాట‌క‌ ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న జ‌న‌తాద‌ళ్ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ప్ర‌చారానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ‌స్తార‌ని మాజీ ప్ర‌ధాని దేవెగౌడ వెల్ల‌డించారు. దీనికి సంబంధించి మాజీ ముఖ్య‌మంత్రి కుమార‌స్వామితో బీఆర్ఎస్ నేత‌లు చ‌ర్చిస్తున్నార‌ని ఆయ‌న తెలిపారు. బెంగ‌ళూరులోని జేడీ(ఎస్‌) పార్టీ ప్ర‌ధాన కార్యాల‌యంలో గురువారం ఆయ‌న విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడారు.

రాబోయే రోజుల్లో దేశ రాజ‌కీయాల్లో కీల‌క మార్పులు చోటుచేసుకుంటాయ‌ని దేవెగౌడ వెల్ల‌డించారు. ఆ దిశ‌లోనే తాము తెలంగాణ ముఖ్య‌మంత్రి చంద్ర‌శేఖ‌ర‌రావు, ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీల‌తో నిరంత‌రం చ‌ర్చ‌లు జ‌రుపుతున్నామ‌ని తెలిపారు. ప్ర‌జ‌లు మార్పును కోరుకుంటున్నార‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న స్ప‌ష్టం చేశారు.

క‌ర్నాట‌కలో జ‌రుగుతున్న ఎన్నిక‌ల్లో జ‌నతాద‌ళ్ పూర్తిస్థాయి మెజారిటీతో అధికారంలోకి వ‌స్తుంద‌ని తాము భావిస్తున్నామ‌ని దేవెగౌడ చెప్పారు. త‌మ పార్టీ ప్ర‌క‌టించిన పంచ ర‌త్న ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లకు ప్ర‌తి ఒక్క‌రికీ మేలు జ‌రుగుతుంద‌ని వివ‌రించారు.

First Published:  28 April 2023 3:06 AM GMT
Next Story