Telugu Global
National

సభలో మాట్లాడుతూనే.. స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి

యావత్మాల్‌ పరిధిలోని పూసాద్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా.. గడ్కరీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు.

సభలో మాట్లాడుతూనే.. స్పృహతప్పి పడిపోయిన కేంద్రమంత్రి
X

మహారాష్ట్రలోని యావత్మాల్‌లో బుధవారం జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తుండగా కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీ స్పృహతప్పి పడిపోయారు. దీంతో ఆయన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. తర్వాతి ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి.

యావత్మాల్‌ పరిధిలోని పూసాద్‌ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తుండగా.. గడ్కరీ ఒక్కసారిగా స్పృహ కోల్పోయారు. అనంతరం ఆయన కిందపడిపోబోయారు. దీంతో అక్కడే వేదికపై ఉన్న బీజేపీ నాయకులు పరుగుపరుగున వచ్చి గడ్కరీని పట్టుకున్నారు. స్పృహలోకి వచ్చేందుకు ఆయన మొహంపైకి పలువురు పార్టీ కార్యకర్తలు నీళ్లు చల్లారు. వెంటనే హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రిలో గడ్కరీని చేర్పించారు. గడ్కరీ పర్యటించిన యావత్మాల్ ప్రాంతంలో ప్రస్తుతం తీవ్రమైన వడగాలులు వీస్తున్నాయి. అందువల్లే ఆయన స్పృహతప్పి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.

First Published:  24 April 2024 5:17 PM GMT
Next Story