Telugu Global
Telangana

ఉసురు తీసిన అత్యాశ‌.. ముగ్గురు పిల్ల‌ల్ని చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌

డ‌బ్బుల కోసం ఒత్తిడి ఎక్కువ కావ‌డంతో ఏం చేయాలో తోచ‌ని ర‌వి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న ముగ్గురు పిల్ల‌ల‌నూ చంపి తాను చెట్టుకు ఉరివేసుకుని చ‌నిపోయాడు.

ఉసురు తీసిన అత్యాశ‌.. ముగ్గురు పిల్ల‌ల్ని చంపి తండ్రి ఆత్మ‌హ‌త్య‌
X

వెయ్యి రూపాయ‌లు పెట్టుబ‌డి పెడితే వేల‌కు, ల‌క్ష పెడితే ఐదారు రెట్లు డ‌బ్బులు ఇప్పిస్తానంటూ న‌మ్మ‌బ‌లికి ప‌లువురితో డ‌బ్బులు క‌ట్టించాడో యువ‌కుడు. తీరా ఇప్పుడు వాళ్లంద‌రూ డ‌బ్బులు అడుగుతుండ‌టంతో దిక్కు తోచ‌క ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. దానికి కొన్ని క్ష‌ణాల ముందే ముగ్గురు బిడ్డ‌ల ఆయువూ తీసేశాడు. ఈ దారుణం రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లి మండ‌లంలో సోమ‌వారం చోటుచేసుకుంది.

వెయ్యికి రూ.3వేలు.. ల‌క్ష‌కు రూ.5 ల‌క్ష‌లు

రంగారెడ్డి జిల్లా శంక‌ర్‌ప‌ల్లి మండ‌లం టంగుటూరుకు చెందిన ర‌వి మ‌నీ స్కీమ్ పేరుతో జ‌నాన్ని న‌మ్మించాడు. వెయ్యి రూపాయ‌లు క‌డితే 58 రోజుల‌కు రూ.3వేలు, అదే ల‌క్ష కడితే రూ.5 ల‌క్ష‌లు ఇప్పిస్తాన‌ని న‌మ్మబ‌ల‌క‌డంతో చుట్టుప‌క్క‌ల గ్రామాల వారు కూడా పెద్ద ఎత్తున డ‌బ్బులు క‌ట్టారు. ఆ డ‌బ్బులు ఏం చేశాడో తెలియ‌దుగానీ డ‌బ్బులిచ్చిన వాళ్లంతా మాకు ఇస్తాన‌న్న మొత్తం ఏదంటూ ఇంటికొచ్చి నిల‌దీయ‌డం మొద‌లుపెట్టారు.

డ‌బ్బుల కోసం ఒత్తిడి ఎక్కువ కావ‌డంతో ఏం చేయాలో తోచ‌ని ర‌వి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. త‌న ముగ్గురు పిల్ల‌ల‌నూ చంపి తాను చెట్టుకు ఉరివేసుకుని చ‌నిపోయాడు.

First Published:  4 March 2024 6:55 AM GMT
Next Story