Telugu Global
Telangana

జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ల‌కు ఏడాది జైలు శిక్ష‌.. - ప‌రువు న‌ష్టం కేసులో న్యాయ‌స్థానం తీర్పు

చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ల‌పై అల్లు అర‌వింద్ ప‌రువునష్టం దావా వేశారు.

జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ల‌కు ఏడాది జైలు శిక్ష‌.. - ప‌రువు న‌ష్టం కేసులో న్యాయ‌స్థానం తీర్పు
X

సినీ న‌టులు జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తుల‌కు ప‌రువు న‌ష్టం కేసులో ఏడాది జైలు శిక్ష విధిస్తూ నాంప‌ల్లిలోని ఏసీఎంఎం (అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్) కోర్టు తీర్పు వెల్ల‌డించింది. మ‌రో రూ.5 వేలు జ‌రిమానా కూడా విధించింది. చిరంజీవి బ్ల‌డ్‌బ్యాంకుపై 2011లో వారు చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌పై సినీ నిర్మాత అల్లు అర‌వింద్ అప్ప‌ట్లో న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించారు.

చిరంజీవి పేరుతో నడుస్తున్న సేవా కార్యక్రమాలపై, ట్రస్టు సేవలపై అసత్య ఆరోపణలు చేశారంటూ జీవిత‌, రాజ‌శేఖ‌ర్‌ల‌పై అల్లు అర‌వింద్ ప‌రువునష్టం దావా వేశారు. అప్ప‌టి నుంచి విచార‌ణ కొన‌సాగుతున్న ఈ కేసులో నాంప‌ల్లి కోర్టు తీర్పు తాజాగా తీర్పు వెలువరించింది. ఈ నేప‌థ్యంలో జీవిత‌, రాజ‌శేఖ‌ర్ దంప‌తులు జ‌రిమానా చెల్లించ‌డంతో పై కోర్టులో అప్పీలుకు అవ‌కాశ‌మిస్తూ న్యాయ‌స్థానం వారికి బెయిల్ మంజూరు చేసింది.

First Published:  19 July 2023 2:01 AM GMT
Next Story