Telugu Global
Telangana

అటు మణిపూర్ తగలబడుతుంటే.. ఇక్కడ నీచ రాజకీయాలా..? -దాసోజు శ్రవణ్‌

అటు మణిపూర్ ఆదిమ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకిపోతోంది. గత కొంత కాలంగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలతో ఇప్పటికే చాలా మంది చనిపోయారు.

అటు మణిపూర్ తగలబడుతుంటే.. ఇక్కడ నీచ రాజకీయాలా..? -దాసోజు శ్రవణ్‌
X

మణిపూర్‌లో హింస, విధ్వంసం, లూటీలు, మహిళలపై అత్యాచారాలతో ఆ రాష్ట్రం తగలబడిపోతుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణలో నీచ రాజకీయాలకు దిగడం హాస్యాస్పదంగా ఉందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి అనే విషయాన్ని కిషన్ రెడ్డి మర్చిపోయారా అని ఎద్దేవా చేశారు. తెలంగాణలో డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని బీజేపీ బాటసింగారంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వ‌ద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. పోలీసులు అందుకు అనుమతి నివ్వలేదు. అయినప్పటికీ కిషన్ రెడ్డి, రఘునందన్ రావు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి బాటసింగారం వెళ్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. బీజేపీ చ‌ర్య‌ల‌పై బీఆర్ఎస్ నేత దాసోజు శ్ర‌వ‌ణ్ మండిప‌డ్డారు.

అటు మణిపూర్ ఆదిమ తెగల మధ్య ఘర్షణలతో అట్టుడుకిపోతోంది. గత కొంత కాలంగా జరుగుతున్న హింసాత్మక సంఘటనలతో ఇప్పటికే చాలా మంది చనిపోయారు. శాంతి భద్రతలను కాపాడడంలో అక్కడి బీజేపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. తాజాగా ఓ తెగకు చెందిన మహిళలను మరో తెగకు చెందిన వారు నగ్నంగా ఊరేగించడంపై దేశవ్యాప్తంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనపై దేశ అత్యున్నత న్యాయస్థానం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ ఘటనను సుమోటోగా స్వీకరించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను వివరణ కోరింది. ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు చర్యలు తీసుకోలేకపోతే తామే తీసుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

First Published:  20 July 2023 11:15 AM GMT
Next Story