Telugu Global
Telangana

సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్‌.. ఆ 4 వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు

కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు.

సిరిసిల్లలో కేటీఆర్, సంగారెడ్డిలో హరీష్‌.. ఆ 4 వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ రైతు దీక్షలు
X

రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో బీఆర్‌ఎస్‌ రైతుదీక్షలు కొనసాగుతున్నాయి. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ శ్రేణులు ఈ దీక్షల్లో పాల్గొంటున్నాయి. సిరిసిల్లలో కేటీఆర్‌, సంగారెడ్డిలో హరీశ్‌రావు, సూర్యాపేటలో జగదీశ్‌రెడ్డి, పాలకుర్తిలో ఎర్రబెల్లి దయాకర్‌రావు దీక్షలో పాల్గొని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు.

అసెంబ్లీ ఎన్నికల్లో రైతుభరోసా పేరిట కాంగ్రెస్‌ ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని బీఆర్ఎస్ మండిపడుతోంది. కాంగ్రెస్‌ అధికారంలోకొచ్చి 4 నెలలు అవుతున్నా హామీలను అమలు చేయకపోగా, రైతులను ఇష్టారీతిగా అవమానాలకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గులాబీ నేతలు.

BRS చెబుతున్న కాంగ్రెస్ వైఫల్యాలు..

- రైతుబంధు విడుదలలో జాప్యం

- కరెంట్‌ కోతలు

- ధాన్యానికి రూ.500 బోనస్‌ హామీ ఇచ్చి నిలబెట్టుకోకపోవటం

- కాంగ్రెస్‌ అనాలోచిత చర్యలతో 209 మంది రైతుల ఆత్మహత్య

First Published:  6 April 2024 7:14 AM GMT
Next Story