Telugu Global
Telangana

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఆయనే.. ఇవాళ నామినేషన్.!

కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం వెలిచాల రాజేందర్‌ రావుతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు.

కరీంనగర్ ఎంపీ అభ్యర్థి ఆయనే.. ఇవాళ నామినేషన్.!
X

కరీంనగర్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థిపై క్లారిటీ వచ్చేసింది. వెలిచాల రాజేందర్‌ రావుకే అధిష్టానం టికెట్ కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు హైకమాండ్‌ నుంచి సమాచారం రావడంతో ఇవాళ నామినేషన్ దాఖలు చేసేందుకు వెలిచాల సిద్ధమయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొంటారని తెలుస్తోంది.

ఖమ్మం, హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌ పార్లమెంట్ స్థానానికి అభ్యర్థిని ప్రకటించలేదు కాంగ్రెస్‌. కరీంనగర్ ఎంపీ టికెట్ కోసం వెలిచాల రాజేందర్‌ రావుతో పాటు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి పోటీ పడుతున్నారు.

వెలిచాల రాజేందర్‌ రావు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు కుమారుడు. 2009లో ప్రజారాజ్యం త‌ర‌ఫున‌ కరీంనగర్ ఎంపీగా పోటీ చేసిన రాజేందర్‌ రావు లక్షకుపైగా ఓట్లు సాధించి మూడో స్థానానికి పరిమితమయ్యారు.

First Published:  22 April 2024 5:03 AM GMT
Next Story