Telugu Global
Telangana

మోసం పార్ట్‌-1 ముగిసింది.. పార్ట్‌ - 2 మిగిలింది..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు

చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

మోసం పార్ట్‌-1 ముగిసింది.. పార్ట్‌ - 2 మిగిలింది..కాంగ్రెస్‌పై కేటీఆర్ సెటైర్లు
X

తెలంగాణలో ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీ మోసం పార్ట్‌ - 1 నడిచింది.. మోసం పార్ట్ - 2 మిగిలి ఉందంటూ సెటైర్లు వేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆగస్టు 15లోగా రుణమాఫీ చేస్తామని మరోసారి మోసం చేసేందుకు సీఎం రేవంత్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ నామినేషన్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.

తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు గానూ 12 స్థానాలకు బీఆర్ఎస్‌ను గెలిపించాలన్నారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 220 సీట్లు, యూపీఏకు 150 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్‌కు 12 సీట్లు కట్టబెడితే.. ఎన్డీఏ, యూపీఏ కూటమి వచ్చి తెలంగాణకు ఏది కావాలంటే అది చేస్తామని ప్రాధేయపడుతారని చెప్పారు.

BRS ప్రభుత్వంలో రంజిత్ రెడ్డి ఎంపీగా, పట్నం మహేందర్ రెడ్డి మంత్రులుగా పదవులు అనుభవించి పార్టీని మోసం చేశారని విమర్శించారు కేటీఆర్. రాబోయే ఎన్నికల్లో రంజిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డిలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అధికారం పోగానే పిరికిపందల్లా జారుకున్నారంటూ ఫైర్ అయ్యారు. అరచేతిలో వైకుంఠం చూపించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు కేటీఆర్. మరోసారి మోసపోయేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరన్నారు.

First Published:  23 April 2024 11:40 AM GMT
Next Story