Telugu Global
Telangana

200 లీటర్ల పాలను 1000 లీటర్లు చేశా - మంత్రి మల్లారెడ్డి

పాలు అమ్మడంలో ప్రజలను మోసగించినా, పూలు అమ్మడంలో మాత్రం ఎటువంటి మోసం చేయలేదని మల్లారెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో తనకన్నా ఎవరూ ఫేమస్ లేరని, సినీ ప్రముఖుల కన్నా తానే ఫేమస్ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

200 లీటర్ల పాలను 1000 లీటర్లు చేశా - మంత్రి మల్లారెడ్డి
X

తాను రోజుకు వెయ్యి లీటర్ల పాలు అమ్మిన సమయంలో నీళ్లతో పాటు పాల పౌడర్ కలిపినట్లు మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఇవాళ ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మల్లారెడ్డి పాల వ్యాపారం చేసే రోజులను గుర్తు చేసుకున్నారు.

తాను పాలు విక్రయించే సమయంలో చిన్న చిన్న వెండర్ల నుంచి 200 లీటర్ల పాలు సేకరించేవాడినని తెలిపారు. పాలు తక్కువ అయితే నీళ్లు పోయడంతో పాటు పాల పౌడర్ కలిపేవాడినని చెప్పారు. పాలలో కలిపేందుకు ఆస్ట్రేలియా నుంచి పాల పౌడర్ తెప్పించేవాడినన్నారు.

పాలు అమ్మడంలో ప్రజలను మోసగించినా, పూలు అమ్మడంలో మాత్రం ఎటువంటి మోసం చేయలేదని మల్లారెడ్డి వెల్లడించారు. సోషల్ మీడియాలో తనకన్నా ఎవరూ ఫేమస్ లేరని, సినీ ప్రముఖుల కన్నా తానే ఫేమస్ అని మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.


కాంగ్రెస్ క్రమశిక్షణ లేని పార్టీ అని మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమని చెప్పారు. తాము వద్దన్నా కాంగ్రెస్ నేతలు బీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని అన్నారు. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో గెలిచినవారు కూడా మళ్ళీ బీఆర్‌ఎస్‌లోకి వస్తారని మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


First Published:  23 Nov 2023 3:53 PM GMT
Next Story