Telugu Global
Telangana

ఓటుకు 5 నుంచి 10వేలు.. కడియం ఖర్చు 100 కోట్లా..?

ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వబోతున్నాడని.. కూతురి కోసం రూ.100 కోట్లు ఖర్చ పెట్టనున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు.

ఓటుకు 5 నుంచి 10వేలు.. కడియం ఖర్చు 100 కోట్లా..?
X

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఎమ్మార్పీఎస్‌ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ నుంచి కడియంకు భారీగా డబ్బులు అందాయని ఆరోపించారు. అవినీతితో వందల కోట్లు సంపాదించిన కడియం.. ఆ సొమ్ముతో తన కూతురు కడియం కావ్యను లోక్‌సభ ఎన్నికల్లో గెలిపించుకోవాలని చూస్తున్నాడన్నారు. ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఇవ్వబోతున్నాడని.. కూతురి కోసం రూ.100 కోట్లు ఖర్చ పెట్టనున్నాడంటూ సంచలన ఆరోపణలు చేశారు. అవినీతిపరుడైన కడియంను ఈ ఎన్నికల్లో ఓడించాలని ప్రజలకు మందకృష్ణ పిలుపునిచ్చారు.

కుమార్తె కడియం కావ్య కోసం స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అధికార కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. బీఆర్‌ఎస్‌ పార్టీ ఆమెకు టికెట్‌ ఇచ్చినప్పటికీ.. దానిని కాదని కాంగ్రెస్‌లోకి వెళ్లారు. దీంతో వరంగల్‌ లోక్‌సభ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పార్టీ అధినే కేసీఆర్‌.. సుధీర్‌ మాదిగను ప్రకటించారు.

First Published:  26 April 2024 11:12 AM GMT
Next Story