Telugu Global
Telangana

బీజేపీ నేతలు బిచ్చగాళ్లు.. ఆర్మూర్‌లో రేవంత్ రెడ్డి

బజారులో దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేవాడు బిచ్చపోడే అంటూ విమర్శించారు రేవంత్. బీజేపీ వాళ్లు సైతం దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

బీజేపీ నేతలు బిచ్చగాళ్లు.. ఆర్మూర్‌లో రేవంత్ రెడ్డి
X

బీజేపీ నేతలను బిచ్చగాళ్లతో పోల్చారు సీఎం రేవంత్ రెడ్డి. నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జీవన్ రెడ్డికి మద్దతుగా ఆర్మూర్‌లో రోడ్‌ షో నిర్వహించిన రేవంత్ రెడ్డి.. బీజేపీ నేతలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవుడి గుడిలో ఉండాలి.. భక్తి గుండెల్లో ఉండాలన్న రేవంత్‌.. అలాంటి వారే అసలైన హిందువులన్నారు. బజారులో దేవుడి బొమ్మ పెట్టి ఓట్లు అడుక్కునేవాడు బిచ్చపోడే అంటూ విమర్శించారు రేవంత్. బీజేపీ వాళ్లు సైతం దేవుడి పేరుతో ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు.

ఇక రైతుబంధుపైనా రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈసీ అడ్డగించినా రైతుబంధు పంపిణీ పూర్తయిపోయిందన్నారు. కేసీఆర్‌కు సిగ్గు, శరం ఉంటే అమరవీరుల స్థూపం దగ్గర ముక్కు నేలకు రాయాలన్నారు రేవంత్. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేసి సిద్దిపేటకు పట్టిన హరీష్‌ రావు పీడను పోగొడతానన్నారు రేవంత్.

పసుపు బోర్డుపై అర్వింద్ హామీ ఇచ్చి మోసం చేశారని గుర్తు చేశారు రేవంత్. నిజామాబాద్‌ పార్లమెంట్‌లో 2014లో బీఆర్ఎస్‌కు, 2019లో బీజేపీకి అవకాశమిచ్చారని..ఈ సారి కాంగ్రెస్‌కు అవకాశమివ్వాలని కోరారు రేవంత్ రెడ్డి.

First Published:  8 May 2024 4:56 PM GMT
Next Story