Telugu Global
Telangana

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. సెల్‌ఫోన్ తీసిన ప్రాణాలు

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు సాయిసుమ(19) సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది.

అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి.. సెల్‌ఫోన్ తీసిన ప్రాణాలు
X

మంచిర్యాల జిల్లాలో దారుణం జరిగింది. సెల్‌ఫోన్ కారణంగా రెండు వేర్వేలు ఘటనలో రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. ఓ ఘటనలో అమ్మాయి ఆత్మహత్య చేసుకోగా.. మరో ఘటనలో అబ్బాయి తండ్రినే చంపేశాడు.

వివరాళ్లోకి వెళ్తే.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం వేలాల గ్రామానికి చెందిన ప్యాగ సారక్క, స్వామి దంపతులకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. కూతురు సాయిసుమ(19) సెల్ ఫోన్ బాగు చేయించమని తల్లిదండ్రులను అడిగింది. దీంతో తరచూ సెల్‌ఫోన్ పాడు చేస్తున్నావని సాయిసుమను తల్లి మందలించింది. ఇంట్లో పరిస్థితులేం బాలేవు. కొద్ది రోజుల తర్వాత బాగు చేయిస్తామని చెప్పింది. అన్న అడిగితే బాగు చేయిస్తారు కానీ, తాను అడిగితే మాత్రం ఏమీ చెయ్యరు అంటూ సాయిసుమ మనస్తాపానికి గురైంది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లిన తర్వాత ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

మరో ఘటనలో సెల్‌ఫోన్‌ వల్ల జరిగిన గొడవతో తండ్రినే చంపేశాడు కొడుకు. వివారాళ్లోకి వెళ్తే.. రామకృష్ణాపూర్‌కు చెందిన సింగరేణి విశ్రాంత కార్మికుడు రాయమల్లుకు(62) రాకేష్‌ అనే కొడుకు ఉన్నాడు. సెల్‌ఫోన్‌ విషయంలో తండ్రి, కొడుకుల మధ్య ఘర్షణ నెలకొంది. దీంతో ఆవేశానికి గురైన రాకేష్..‌ తండ్రి రాయమల్లు తలపై రోకలిబండతో కొట్టి చంపేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

First Published:  12 April 2024 9:40 AM GMT
Next Story